అమెరికాలో... బాపట్ల జిల్లా విద్యార్థిని అనారోగ్యంతో మృతి

  • టెక్సాస్ ఏ అండ్ ఎమ్ వర్సిటీలో ఎంఎస్ పూర్తి చేసిన యార్లగడ్డ రాజ్యలక్ష్మి
  • రాజ్యలక్ష్మి స్వస్థలం బాపట్ల జిల్లా కారంచేడు
  • రాజ్యలక్ష్మి మృతితో ఆమె కుటుంబంలో తీవ్ర విషాదం
ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన తెలుగు విద్యార్థిని అనారోగ్యంతో మృతి చెందింది. ఈ విషాద ఘటన బాపట్ల జిల్లా కారంచేడులో తీవ్ర శోకాన్ని నింపింది. గ్రామానికి చెందిన యార్లగడ్డ రాజ్యలక్ష్మి (23) అమెరికాలో కన్నుమూసింది.

వివరాల్లోకి వెళితే, యార్లగడ్డ రాజ్యలక్ష్మి అమెరికాలోని ప్రఖ్యాత టెక్సాస్ ఏ అండ్ ఎమ్ యూనివర్సిటీలో ఇటీవల తన ఎంఎస్ విద్యను పూర్తి చేశారు. ఉన్నత భవిష్యత్తుపై ఎన్నో ఆశలతో ఉన్న ఆమె, అనారోగ్యం బారిన పడి చికిత్స పొందుతూ మరణించినట్లు సమాచారం. ఈ వార్త తెలియగానే కారంచేడులోని ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. ఉన్నత చదువులు పూర్తి చేసుకుని ఉజ్వల భవిష్యత్తుతో తిరిగి వస్తుందనుకున్న కుమార్తె అకాల మరణంతో తల్లిదండ్రులు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు.

రాజ్యలక్ష్మి మృతి పట్ల పర్చూరు శాసనసభ్యుడు ఏలూరి సాంబశివరావు ఆమె కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపం తెలిపారు. కారంచేడు గ్రామంలో ఈ ఘటనతో విషాద ఛాయలు అలుముకున్నాయి.


More Telugu News

Yarlagadda Rajyalakshmi Bapatla district Texas A&M University Telugu student US student death Karamchedu Eluri Sambasiva Rao MS degree Andhra Pradesh