నీ కోసం నా భార్యను చంపేశా.. లవర్ కు బెంగళూరు డాక్టర్ మెసేజ్
- బెంగళూరు వైద్యురాలి హత్య కేసులో వెలుగులోకి సంచలన విషయాలు
- మత్తుమందు అధిక మోతాదులో భార్యకు ఇంజెక్ట్ చేసిన డాక్టర్ మహేంద్రా రెడ్డి
- భార్యను చంపేశాక డిజిటల్ పేమెంట్ యాప్ లో ప్రియురాలికి సందేశం
- హత్య జరిగిన ఆరు నెలల తర్వాత మహేంద్ర అరెస్టు
ప్రియురాలికి మెసేజ్
అనారోగ్యానికి గురైన కృతికారెడ్డికి ఇంట్లోనే చికిత్స అందించిన మహేంద్రారెడ్డి.. ఓ మత్తుమందును అధిక మోతాదులో ఇంజెక్ట్ చేశాడు. దీంతో కృతికా రెడ్డి మరణించింది. కృతిక చనిపోయిందని నిర్ధారించుకున్న డాక్టర్ మహేంద్ర తన ప్రియురాలికి మెసేజ్ చేశాడు. ‘నీ కోసం నా భార్యను చంపేశాను’ అంటూ ఓ డిజిటల్ పేమెంట్ యాప్ లో మెసేజ్ చేశాడు. వాట్సాప్, మెసేజ్ ద్వారా సందేశం పంపిస్తే పోలీసులకు దొరికిపోతానని అతితెలివిగా డిజిటల్ పేమెంట్ యాప్ లో మెసేజ్ చేశాడు. తాజాగా పోలీసులు ఈ విషయాన్ని బయటపెట్టారు. దీనిపై మహేంద్రా రెడ్డి ప్రియురాలిని ప్రశ్నించి, ఆమె స్టేట్ మెంట్ రికార్డు చేసినట్లు తెలిపారు. అయితే, ఆమె ఎవరనే విషయాన్ని పోలీసులు వెల్లడించలేదు.