Ravichandran Ashwin: పురుషుల జట్టుకు అశ్విన్ చురక.. మహిళల టీమ్ను చూసి నేర్చుకోవాలన్న స్పిన్నర్
- తొలిసారి వన్డే ప్రపంచకప్ గెలిచిన భారత మహిళల జట్టు
- విజయాన్ని దిగ్గజ క్రీడాకారిణులతో పంచుకున్న హర్మన్ప్రీత్ సేన
- మహిళల జట్టు చేసిన పని పురుషుల జట్టు ఎప్పుడూ చేయలేదన్న అశ్విన్
- సీనియర్లకు నిజమైన గౌరవం ఇచ్చారని అమ్మాయిలపై ప్రశంసలు
టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, భారత మహిళల క్రికెట్ జట్టుపై ప్రశంసలు కురిపిస్తూనే, పురుషుల జట్టుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తొలిసారి వన్డే ప్రపంచకప్ గెలిచిన అమ్మాయిలు తమ విజయాన్ని పంచుకున్న తీరు అద్భుతమని, ఇలాంటి పనిని పురుషుల జట్టు ఇప్పటివరకూ ఎప్పుడూ చేయలేదని ఆయన అన్నారు.
ఆదివారం జరిగిన ఫైనల్లో చారిత్రక విజయం సాధించిన హర్మన్ప్రీత్ కౌర్ బృందం, తమ సంబరాల్లో భారత మహిళా క్రికెట్ దిగ్గజాలైన మిథాలీ రాజ్, ఝులన్ గోస్వామి, అంజుమ్ చోప్రాలను భాగం చేసింది. నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో కామెంటరీ బృందంలో ఉన్న వీరిని మైదానంలోకి ఆహ్వానించి, ట్రోఫీని వారితో కలిసి పైకెత్తి ఆనందాన్ని పంచుకుంది.
ఈ గొప్ప సంస్కృతిపై తన యూట్యూబ్ చానల్లో అశ్విన్ స్పందించాడు. "భారత మహిళల జట్టు చేసిన ఈ పనికి నేను హ్యాట్సాఫ్ చెబుతున్నా. భారత పురుషుల జట్టు ఇలాంటి పని ఎప్పుడూ చేయలేదు. మీడియా ముందు చాలామంది తమ ముందు తరం ఆటగాళ్లను గౌరవిస్తామని చెబుతారు. కానీ నిజమైన గౌరవం ఇవ్వడం చాలా అరుదుగా చూస్తాం. 'మా తరం జట్టు గొప్పది, మీ తరం అంత గొప్పది కాదు' అనే చర్చలే ఎక్కువగా జరుగుతుంటాయి. కానీ అమ్మాయిలు నిజమైన గౌరవం ఇచ్చి అందరి మనసులు గెలుచుకున్నారు" అని అశ్విన్ వివరించాడు.
కన్నీళ్లు పెట్టుకున్న ఝులన్ గోస్వామి
ఈ వేడుకలో మాజీ పేసర్ ఝులన్ గోస్వామి భావోద్వేగానికి గురైంది. తన సుదీర్ఘ కెరీర్లో దక్కని ప్రపంచకప్ ట్రోఫీని జూనియర్లు చేతుల్లో పెట్టగానే ఆమె కన్నీళ్లు ఆపుకోలేకపోయింది. దీని వెనుక ఒక బలమైన కారణం ఉందని ఆమె వెల్లడించింది. "ఈ ప్రపంచకప్కు ముందు జూనియర్లందరూ అర్ధరాత్రి నా గదికి వచ్చి 'మేడమ్, ఈసారి మీకోసమే కప్ గెలుస్తాం' అని మాటిచ్చారు. ఆ మాటను ఇప్పుడు నిలబెట్టుకున్నారు. అందుకే నేను అంతగా భావోద్వేగానికి లోనయ్యాను" అని ఝులన్ స్టార్ స్పోర్ట్స్తో మాట్లాడుతూ చెప్పింది. ఈ చారిత్రక విజయంతో, 2005, 2017 ఫైనల్స్లో ఎదురైన పరాజయాల బాధను భారత మహిళల జట్టు చెరిపేసింది. దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ తొలిసారి విశ్వవిజేతగా నిలిచి దేశం గర్వపడేలా చేసింది.
ఆదివారం జరిగిన ఫైనల్లో చారిత్రక విజయం సాధించిన హర్మన్ప్రీత్ కౌర్ బృందం, తమ సంబరాల్లో భారత మహిళా క్రికెట్ దిగ్గజాలైన మిథాలీ రాజ్, ఝులన్ గోస్వామి, అంజుమ్ చోప్రాలను భాగం చేసింది. నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో కామెంటరీ బృందంలో ఉన్న వీరిని మైదానంలోకి ఆహ్వానించి, ట్రోఫీని వారితో కలిసి పైకెత్తి ఆనందాన్ని పంచుకుంది.
ఈ గొప్ప సంస్కృతిపై తన యూట్యూబ్ చానల్లో అశ్విన్ స్పందించాడు. "భారత మహిళల జట్టు చేసిన ఈ పనికి నేను హ్యాట్సాఫ్ చెబుతున్నా. భారత పురుషుల జట్టు ఇలాంటి పని ఎప్పుడూ చేయలేదు. మీడియా ముందు చాలామంది తమ ముందు తరం ఆటగాళ్లను గౌరవిస్తామని చెబుతారు. కానీ నిజమైన గౌరవం ఇవ్వడం చాలా అరుదుగా చూస్తాం. 'మా తరం జట్టు గొప్పది, మీ తరం అంత గొప్పది కాదు' అనే చర్చలే ఎక్కువగా జరుగుతుంటాయి. కానీ అమ్మాయిలు నిజమైన గౌరవం ఇచ్చి అందరి మనసులు గెలుచుకున్నారు" అని అశ్విన్ వివరించాడు.
కన్నీళ్లు పెట్టుకున్న ఝులన్ గోస్వామి
ఈ వేడుకలో మాజీ పేసర్ ఝులన్ గోస్వామి భావోద్వేగానికి గురైంది. తన సుదీర్ఘ కెరీర్లో దక్కని ప్రపంచకప్ ట్రోఫీని జూనియర్లు చేతుల్లో పెట్టగానే ఆమె కన్నీళ్లు ఆపుకోలేకపోయింది. దీని వెనుక ఒక బలమైన కారణం ఉందని ఆమె వెల్లడించింది. "ఈ ప్రపంచకప్కు ముందు జూనియర్లందరూ అర్ధరాత్రి నా గదికి వచ్చి 'మేడమ్, ఈసారి మీకోసమే కప్ గెలుస్తాం' అని మాటిచ్చారు. ఆ మాటను ఇప్పుడు నిలబెట్టుకున్నారు. అందుకే నేను అంతగా భావోద్వేగానికి లోనయ్యాను" అని ఝులన్ స్టార్ స్పోర్ట్స్తో మాట్లాడుతూ చెప్పింది. ఈ చారిత్రక విజయంతో, 2005, 2017 ఫైనల్స్లో ఎదురైన పరాజయాల బాధను భారత మహిళల జట్టు చెరిపేసింది. దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ తొలిసారి విశ్వవిజేతగా నిలిచి దేశం గర్వపడేలా చేసింది.