హరీశ్ రావు ఇంటికి వెళ్లి పరామర్శించిన కవిత
- హరీశ్ తండ్రి మృతి పట్ల కుటుంబానికి సంతాపం
- అంత్యక్రియలకు గైర్హాజరు కావడంతో రేగిన ఊహాగానాలు
- గతంలో కాళేశ్వరంపై హరీశ్ ను టార్గెట్ చేసిన కవిత
అయితే, ఈ పరామర్శకు రాజకీయంగా ప్రాధాన్యత ఏర్పడింది. సత్యనారాయణరావు అంత్యక్రియలకు కవిత హాజరుకాలేదు. దీంతో హరీశ్ తో ఆమెకు ఉన్న విభేదాల కారణంగానే రాలేదంటూ రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో, మూడు రోజుల తర్వాత కవిత స్వయంగా హరీశ్ ఇంటికి వెళ్లి పరామర్శించడం ప్రాధాన్యం సంతరించుకుంది.
గతంలో కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి విషయంలో కవిత... హరీశ్ పై తీవ్రమైన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఆ వ్యాఖ్యలపై హరీశ్ నేరుగా స్పందించకపోయినా, తన ప్రస్థానం తెరిచిన పుస్తకం అంటూ పరోక్షంగా సమాధానమిచ్చారు. ఆ వివాదం తర్వాత హరీశ్ ఇంటికి కవిత వెళ్లడం ఇదే మొదటిసారి.