తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన.. హెలికాప్టర్లో బయలుదేరిన సీఎం చంద్రబాబు
- మొంథా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు పర్యటన
- ఐదు జిల్లాల్లో హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే
- బాపట్ల, పల్నాడు, కృష్ణా, కోనసీమ, ఏలూరు జిల్లాల్లో పరిశీలన
- కోనసీమ జిల్లా ఓడలరేవులో ల్యాండ్ కానున్న సీఎం
- భూమార్గంలో నీట మునిగిన పంట పొలాల పరిశీలన
- తుపాను నష్టాన్ని స్వయంగా అంచనా వేయనున్న ముఖ్యమంత్రి
ముఖ్యమంత్రి పర్యటనలో భాగంగా చిలకలూరిపేట, పర్చూరు, చీరాల, కోడూరు, నాగాయలంక మీదుగా హెలికాప్టర్లో ప్రయాణిస్తూ పరిస్థితులను సమీక్షిస్తారు. అనంతరం కోనసీమ జిల్లా అల్లవరం మండలంలోని ఓడలరేవు వద్ద ఆయన హెలికాప్టర్ ల్యాండ్ అవుతుంది.
ఓడలరేవుకు చేరుకున్న తర్వాత ముఖ్యమంత్రి రోడ్డు మార్గంలో ప్రయాణిస్తారు. మొంథా తుపాను కారణంగా కురిసిన భారీ వర్షాలకు నీట మునిగిన పంట పొలాలను ఆయన పరిశీలిస్తారు. రైతులను పరామర్శించి, పంట నష్టం వివరాలను అడిగి తెలుసుకుంటారు. క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితిని అంచనా వేసి, ప్రభుత్వ పరంగా చేపట్టాల్సిన సహాయక చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు.