ఏపీఎస్ఆర్టీసీలో ఆ అధికారులకు పదోన్నతులు.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
- ఆరుగురు అధికారులకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా పదోన్నతి
- ఇప్పటివరకు ఇన్ఛార్జి ఈడీలుగా ఉన్న అధికారులకే ప్రమోషన్లు
- విజయవాడ, కడప, నెల్లూరు జోన్ల ఈడీలకు పదోన్నతి ఖరారు
- మరో 15 మంది సీనియర్ స్కేల్ అధికారులకు ఆర్ఎంలుగా ప్రమోషన్
పదోన్నతి పొందిన అధికారులలో జి. విజయరత్నం (విజయవాడ జోన్), జీవీ రవివర్మ (పరిపాలన), టి. చెంగల్రెడ్డి (ఇంజినీరింగ్) ఉన్నారు. వీరితో పాటు పి. చంద్రశేఖర్ (కడప జోన్), ఎ. అప్పలరాజు (ఆపరేషన్స్), జి. నాగేంద్రప్రసాద్ (నెల్లూరు జోన్)లకు కూడా ఈడీలుగా ప్రమోషన్ కల్పించారు.
ఇదే క్రమంలో మరో 15 మంది సీనియర్ స్కేల్ కేడర్ అధికారులకు కూడా పదోన్నతులు కల్పించారు. వీరిని స్పెషల్ స్కేల్ సర్వీస్ (ఆర్ఎం) కేడర్కు ప్రమోట్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఈ పదోన్నతుల ద్వారా ఆర్టీసీలోని కీలక విభాగాల్లో పరిపాలన మరింత పటిష్ఠం కానుందని భావిస్తున్నారు.