ఫెవికాల్, వొడాఫోన్ యాడ్స్ సృష్టికర్త ఇకలేరు!
- ప్రముఖ అడ్వర్టైజింగ్ నిపుణుడు పియూష్ పాండే (70) కన్నుమూత
- ఫెవికాల్, వొడాఫోన్ పగ్ యాడ్స్ వంటి ఐకానిక్ ప్రకటనల రూపశిల్పి
- 'అబ్ కీ బార్, మోదీ సర్కార్' నినాదాన్ని సృష్టించింది ఈయనే
- కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, పలువురు ప్రముఖుల సంతాపం
- 2016లో పద్మశ్రీ పురస్కారం అందుకున్న పాండే
భారత ప్రకటనల రంగంలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న దిగ్గజం, పద్మశ్రీ అవార్డు గ్రహీత పియూష్ పాండే (70) శుక్రవారం కన్నుమూశారు. ఫెవికాల్, వొడాఫోన్ పగ్ యాడ్స్ వంటి ఎన్నో మరపురాని ప్రకటనలతో కోట్లాది మంది భారతీయుల మనసుల్లో నిలిచిపోయిన ఆయన మృతితో యాడ్స్ ప్రపంచంలో విషాదం నెలకొంది.
ఫెవికాల్ యాడ్స్లో కనిపించే హాస్యం నుంచి క్యాడ్బరీ 'కుచ్ ఖాస్ హై'లోని మాధుర్యం వరకు, ఏషియన్ పెయింట్స్ 'హర్ ఖుషీ మే రంగ్ లాయే' నుంచి వొడాఫోన్ పగ్ యాడ్ వరకు ఆయన సృష్టించిన ప్రతి ప్రకటన భారతీయ జనజీవనంలో భాగమైపోయింది. సామాన్యుడి భావోద్వేగాలను పట్టుకుని, వాటిని అద్భుతమైన కథలుగా మలచడంలో ఆయనది అందెవేసిన చేయి.
వాణిజ్య ప్రకటనలకే పరిమితం కాకుండా, రాజకీయ రంగంలోనూ ఆయన తనదైన ముద్ర వేశారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోసం ఆయన రూపొందించిన 'అబ్ కీ బార్, మోదీ సర్కార్' నినాదం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
పియూష్ పాండే మృతి పట్ల కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. "ప్రకటనల ప్రపంచంలో ఆయనో అద్భుతం. ఆయన సృజనాత్మకత కథనాలకు కొత్త నిర్వచనం ఇచ్చింది. ఆయన నిజాయతీ, ఆత్మీయత, చమత్కారం ఎంతో ఆకట్టుకునేవి. ఆయన లేని లోటు పూడ్చలేనిది" అని గోయల్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. పాండే సన్నిహితుడు సుహేల్ సేఠ్ సైతం తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘భారత్ ఒక గొప్ప ప్రకటనల మేధావినే కాదు, ఒక నిజమైన దేశభక్తుడిని, గొప్ప వ్యక్తిని కోల్పోయింది’’ అని ఆయన పేర్కొన్నారు.
ప్రపంచ ప్రఖ్యాత అడ్వర్టైజింగ్ ఏజెన్సీ ఓగిల్వీకి చీఫ్ క్రియేటివ్ ఆఫీసర్ వరల్డ్వైడ్ (2019), ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ ఇండియాగా పాండే సేవలు అందించారు. ప్రకటనల రంగంలో ఆయన చేసిన సేవలకు గాను భారత ప్రభుత్వం 2016లో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. 2024లో ఆయనకు ప్రతిష్ఠాత్మక ఎల్ఐఏ లెజెండ్ అవార్డు కూడా లభించింది.
ఫెవికాల్ యాడ్స్లో కనిపించే హాస్యం నుంచి క్యాడ్బరీ 'కుచ్ ఖాస్ హై'లోని మాధుర్యం వరకు, ఏషియన్ పెయింట్స్ 'హర్ ఖుషీ మే రంగ్ లాయే' నుంచి వొడాఫోన్ పగ్ యాడ్ వరకు ఆయన సృష్టించిన ప్రతి ప్రకటన భారతీయ జనజీవనంలో భాగమైపోయింది. సామాన్యుడి భావోద్వేగాలను పట్టుకుని, వాటిని అద్భుతమైన కథలుగా మలచడంలో ఆయనది అందెవేసిన చేయి.
వాణిజ్య ప్రకటనలకే పరిమితం కాకుండా, రాజకీయ రంగంలోనూ ఆయన తనదైన ముద్ర వేశారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోసం ఆయన రూపొందించిన 'అబ్ కీ బార్, మోదీ సర్కార్' నినాదం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
పియూష్ పాండే మృతి పట్ల కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. "ప్రకటనల ప్రపంచంలో ఆయనో అద్భుతం. ఆయన సృజనాత్మకత కథనాలకు కొత్త నిర్వచనం ఇచ్చింది. ఆయన నిజాయతీ, ఆత్మీయత, చమత్కారం ఎంతో ఆకట్టుకునేవి. ఆయన లేని లోటు పూడ్చలేనిది" అని గోయల్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. పాండే సన్నిహితుడు సుహేల్ సేఠ్ సైతం తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘భారత్ ఒక గొప్ప ప్రకటనల మేధావినే కాదు, ఒక నిజమైన దేశభక్తుడిని, గొప్ప వ్యక్తిని కోల్పోయింది’’ అని ఆయన పేర్కొన్నారు.
ప్రపంచ ప్రఖ్యాత అడ్వర్టైజింగ్ ఏజెన్సీ ఓగిల్వీకి చీఫ్ క్రియేటివ్ ఆఫీసర్ వరల్డ్వైడ్ (2019), ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ ఇండియాగా పాండే సేవలు అందించారు. ప్రకటనల రంగంలో ఆయన చేసిన సేవలకు గాను భారత ప్రభుత్వం 2016లో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. 2024లో ఆయనకు ప్రతిష్ఠాత్మక ఎల్ఐఏ లెజెండ్ అవార్డు కూడా లభించింది.