నాగార్జున, వెంకటేశ్, నయనతారలతో చిరంజీవి దీపావళి సెలబ్రేషన్స్... ఫొటోలు ఇవిగో!

  • 'ఎక్స్' వేదికగా ట్వీట్ చేసిన సినీ నటుడు చిరంజీవి
  • నాగార్జున, వెంకటేశ్‌, నయనతారలతో కలిసి పండుగ చేసుకున్న ఫొటోలను పంచుకున్న చిరంజీవి
  • వారితో కలిసి పండుగ జరుపుకోవడం ఆనందంగా ఉందని వెల్లడి 
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఇంట దీపావళి వేడుకలు అంబరాన్నంటాయి. ఈసారి ఆయన తన సహ నటులు అక్కినేని నాగార్జున, వెంకటేశ్, నటి నయనతారతో కలిసి దీపావళి పండుగ జరుపుకోవడం విశేషం. నాగార్జున భార్య అమల, వెంకటేశ్ అర్ధాంగి నీరజ కూడా ఈ మెగా దీపావళి వేడుకల్లో పాలుపంచుకున్నారు. దీనిపై చిరంజీవి సోషల్ మీడియా వేదికగా స్పందించారు. సహ నటులతో పండుగ జరుపుకోవడం ఆనందంగా ఉందని 'ఎక్స్' ద్వారా పేర్కొన్నారు.

ఇటువంటి మధుర క్షణాలు హృదయాన్ని ఆనందంతో నింపుతాయని చిరంజీవి అన్నారు. జీవితాన్ని నిజంగా ప్రకాశవంతంగా చేసే ప్రేమ, నవ్వు, ఐక్యతను ఇవి గుర్తుచేస్తాయని పేర్కొన్నారు. ఈ మేరకు వారితో కలిసి దీపావళి సంబరాలు జరుపుకున్న ఫొటోలను సామాజిక మాధ్యమం వేదికగా పంచుకున్నారు.

దీపావళి పండుగ సందర్భంగా అంతకుముందు చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ మీ ఇళ్లకు ఆనందాన్ని తీసుకురావాలని, మీ ప్రయత్నాలకు విజయం చేకూరాలని కోరుకుంటున్నానని చిరంజీవి ఉదయం 'ఎక్స్' వేదికగా ట్వీట్ చేశారు.


More Telugu News