Konda Surekha: ఒకవైపు అడ్డుకుంటూ.. మరోవైపు బంద్‌లో పాల్గొంటారా?: కొండా సురేఖ

Konda Surekha Slams BJP for Double Standards on BC Reservations
షార్ట్స్‌లో చూడండి
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అంశంపై రాష్ట్ర మంత్రి కొండా సురేఖ బీజేపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రిజర్వేషన్ల అమలును అడ్డుకున్నదే బీజేపీ అని, ఇప్పుడు అదే పార్టీ బంద్‌లో పాల్గొంటూ డ్రామాలు ఆడుతోందని ఆమె ఘాటుగా విమర్శించారు.

స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్‌తో బీసీ జేఏసీ ఈరోజు రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ బంద్‌కు మద్దతుగా మంత్రి కొండా సురేఖ, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేశ్‌తో కలిసి రేత్‌ఫైల్ బస్టాండ్ వద్ద నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ బీజేపీ తీరుపై మండిపడ్డారు.

తమ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల విషయంలో పూర్తి చిత్తశుద్ధితో ఉందని కొండా సురేఖ స్పష్టం చేశారు. "సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో మేము చట్టసభల్లో బిల్లును ఆమోదించి, ఆర్డినెన్స్ కూడా జారీ చేశాం. గవర్నర్ గారు ఒక్క సంతకం పెట్టి ఉంటే ఈ సమస్యే ఉండేది కాదు. కానీ, బిల్లును ఆపాలనే కుట్రతోనే దానిని కేంద్రానికి పంపారు" అని ఆమె ఆరోపించారు.

సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం ప్రభుత్వం జీవో జారీ చేస్తే, బీజేపీ నేతలే కోర్టుకు వెళ్లి దానికి అడ్డుపడ్డారని ఆమె గుర్తుచేశారు. ఒకవైపు చట్టపరంగా అడ్డంకులు సృష్టిస్తూ, మరోవైపు ఇప్పుడు బీసీల కోసం చేపట్టిన బంద్‌లో పాల్గొనడం వారి ద్వంద్వ వైఖరికి నిదర్శనమని మంత్రి కొండా సురేఖ విమర్శించారు. 
Go Back to Shorts
Konda Surekha
BC Reservations
Telangana Local Body Elections
BJP Protest
Revanth Reddy
BC JAC Bandh
Sri Ganesh
Telangana Politics
Supreme Court
Reservation Bill

More Telugu News