TCS: ఐటీలో ఉద్యోగాల ఊచకోత: మరో 90 రోజుల్లో 50,000 మంది ఇంటికే
- భారత ఐటీ రంగంపై లేఆఫ్స్ కత్తి
- ఈ ఏడాది 60,000 ఉద్యోగాలకు ముప్పు!
- టీసీఎస్లో 6,000 మందిని తొలగించారంటూ వార్తలు
- టీసీఎస్ తీరుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఫిర్యాదు చేసిన సంఘాలు
- యాక్సెంచర్ బాటలోనే టీసీఎస్
భారత ఐటీ పరిశ్రమలో మరోసారి లేఆఫ్స్ భూతం కోరలు చాస్తోంది. ప్రపంచ ఆర్థిక అనిశ్చితి, ప్రాజెక్టుల కొరత, కృత్రిమ మేధ (ఏఐ) ప్రభావంతో దిగ్గజ కంపెనీలు సైతం ఉద్యోగులను తొలగించేందుకు వెనుకాడటం లేదు. ఈ ఏడాది చివరి నాటికి ఏకంగా 50,000 నుంచి 60,000 మంది ఐటీ ఉద్యోగులు తమ కొలువులు కోల్పోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తుండగా, ఆ ప్రకంపనలు ఇప్పటికే దేశంలోని అతిపెద్ద ఐటీ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్)లో మొదలయ్యాయి.
టీసీఎస్లో ఏం జరుగుతోంది?
పనితీరు బాగోలేదనే నెపంతో ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా టీసీఎస్ సుమారు 6,000 మంది ఉద్యోగులను అక్రమంగా తొలగించిందని ఐటీ ఉద్యోగ సంఘాలు తీవ్ర స్థాయిలో ఆరోపిస్తున్నాయి. పారిశ్రామిక వివాదాల చట్టాన్ని యథేచ్ఛగా ఉల్లంఘించి, ప్రభుత్వ అనుమతి లేకుండా ఇంత భారీ సంఖ్యలో ఉద్యోగులను ఎలా తొలగిస్తారని కిటు, ఏఐటీఈ, యునైట్ వంటి ప్రముఖ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.
కంపెనీ ఇటీవల విడుదల చేసిన త్రైమాసిక ఫలితాల్లో ఉద్యోగుల సంఖ్య 19,755 మేర తగ్గింది. దీనిపై టీసీఎస్ సీహెచ్ఆర్వో సుదీప్ కున్నుమల్ స్పందిస్తూ.. సుమారు 6,000 మంది ‘అసంకల్పిత తొలగింపు’ కిందకు వస్తారని, ఇది వ్యాపార అవసరాల దృష్ట్యా తీసుకున్న నిర్ణయమని సమర్థించుకున్నారు.
ఇది బలవంతపు తొలగింపే..
అయితే, టీసీఎస్ వాదనను ఉద్యోగ సంఘాలు ముక్తకంఠంతో ఖండిస్తున్నాయి. ఇది ‘అసంకల్పిత తొలగింపు’ కాదని, పక్కా ప్రణాళికతో సాగిస్తున్న ‘బలవంతపు, అనైతిక తొలగింపు’ అని మండిపడుతున్నాయి. "ఉద్యోగులను అకస్మాత్తుగా ప్రాజెక్టుల నుంచి తప్పించి బెంచ్కు పంపుతున్నారు. అక్కడ కొన్ని గంటలు లేదా రోజుల్లోనే రాజీనామా చేయాలంటూ హెచ్ఆర్ విభాగం నుంచి తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. చివరకు ప్రసూతి సెలవులో ఉన్న మహిళా ఉద్యోగులను సైతం వదలడం లేదు. సెలవు పొడిగించాలని కోరితే, ఉద్యోగం నుంచి తీసేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారు" అని సంఘాల ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ అక్రమ తొలగింపులపై వెంటనే విచారణ జరిపి, బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఫిర్యాదు చేశారు.
ఏడాది చివరికి మరింత తీవ్రం
టీసీఎస్లో మొదలైన ఈ కోతల పర్వం ఇతర కంపెనీలకూ విస్తరించే ప్రమాదం కనిపిస్తోంది. ప్రముఖ నియామక సంస్థ టీమ్లీజ్ డిజిటల్ సీఈవో నీతి శర్మ అంచనా ప్రకారం గత ఆర్థిక సంవత్సరంలో 25,000 మందిని తొలగించగా, ఈ ఏడాది ఆ సంఖ్య రెట్టింపు అయి 60,000కు చేరవచ్చు. ఇప్పటికే యాక్సెంచర్ ప్రపంచవ్యాప్తంగా 11,000 మందిని ఇంటికి పంపగా, టీసీఎస్ సైతం 2026 మార్చి నాటికి మరో 12,000 మందిని తొలగించేందుకు సిద్ధమవుతోందన్న వార్తలు ఐటీ ఉద్యోగుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. మొత్తం మీద, భారత ఐటీ రంగం అత్యంత గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోందని, రాబోయే రోజుల్లో పరిస్థితులు మరింత సవాలుగా మారబోతున్నాయని స్పష్టమవుతోంది.
టీసీఎస్లో ఏం జరుగుతోంది?
పనితీరు బాగోలేదనే నెపంతో ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా టీసీఎస్ సుమారు 6,000 మంది ఉద్యోగులను అక్రమంగా తొలగించిందని ఐటీ ఉద్యోగ సంఘాలు తీవ్ర స్థాయిలో ఆరోపిస్తున్నాయి. పారిశ్రామిక వివాదాల చట్టాన్ని యథేచ్ఛగా ఉల్లంఘించి, ప్రభుత్వ అనుమతి లేకుండా ఇంత భారీ సంఖ్యలో ఉద్యోగులను ఎలా తొలగిస్తారని కిటు, ఏఐటీఈ, యునైట్ వంటి ప్రముఖ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.
కంపెనీ ఇటీవల విడుదల చేసిన త్రైమాసిక ఫలితాల్లో ఉద్యోగుల సంఖ్య 19,755 మేర తగ్గింది. దీనిపై టీసీఎస్ సీహెచ్ఆర్వో సుదీప్ కున్నుమల్ స్పందిస్తూ.. సుమారు 6,000 మంది ‘అసంకల్పిత తొలగింపు’ కిందకు వస్తారని, ఇది వ్యాపార అవసరాల దృష్ట్యా తీసుకున్న నిర్ణయమని సమర్థించుకున్నారు.
ఇది బలవంతపు తొలగింపే..
అయితే, టీసీఎస్ వాదనను ఉద్యోగ సంఘాలు ముక్తకంఠంతో ఖండిస్తున్నాయి. ఇది ‘అసంకల్పిత తొలగింపు’ కాదని, పక్కా ప్రణాళికతో సాగిస్తున్న ‘బలవంతపు, అనైతిక తొలగింపు’ అని మండిపడుతున్నాయి. "ఉద్యోగులను అకస్మాత్తుగా ప్రాజెక్టుల నుంచి తప్పించి బెంచ్కు పంపుతున్నారు. అక్కడ కొన్ని గంటలు లేదా రోజుల్లోనే రాజీనామా చేయాలంటూ హెచ్ఆర్ విభాగం నుంచి తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. చివరకు ప్రసూతి సెలవులో ఉన్న మహిళా ఉద్యోగులను సైతం వదలడం లేదు. సెలవు పొడిగించాలని కోరితే, ఉద్యోగం నుంచి తీసేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారు" అని సంఘాల ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ అక్రమ తొలగింపులపై వెంటనే విచారణ జరిపి, బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఫిర్యాదు చేశారు.
ఏడాది చివరికి మరింత తీవ్రం
టీసీఎస్లో మొదలైన ఈ కోతల పర్వం ఇతర కంపెనీలకూ విస్తరించే ప్రమాదం కనిపిస్తోంది. ప్రముఖ నియామక సంస్థ టీమ్లీజ్ డిజిటల్ సీఈవో నీతి శర్మ అంచనా ప్రకారం గత ఆర్థిక సంవత్సరంలో 25,000 మందిని తొలగించగా, ఈ ఏడాది ఆ సంఖ్య రెట్టింపు అయి 60,000కు చేరవచ్చు. ఇప్పటికే యాక్సెంచర్ ప్రపంచవ్యాప్తంగా 11,000 మందిని ఇంటికి పంపగా, టీసీఎస్ సైతం 2026 మార్చి నాటికి మరో 12,000 మందిని తొలగించేందుకు సిద్ధమవుతోందన్న వార్తలు ఐటీ ఉద్యోగుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. మొత్తం మీద, భారత ఐటీ రంగం అత్యంత గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోందని, రాబోయే రోజుల్లో పరిస్థితులు మరింత సవాలుగా మారబోతున్నాయని స్పష్టమవుతోంది.