Devineni Avinash: మా దగ్గర డిజిటల్ బుక్ ఉంది.. జగన్ జోలికొస్తే సహించం: దేవినేని అవినాశ్
- రెడ్ బుక్లో పేజీలు చింపితే చిరిగిపోతాయన్న అవినాశ్
- విజయవాడ ఉత్సవాల పేరుతో కేశినేని చిన్ని దోచుకున్నారని ఆరోపణ
- కూటమి ప్రభుత్వంలో పేదలకు ఆనందం కరవైందని వ్యాఖ్య
అధికార కూటమి ప్రభుత్వంపై, ప్రత్యేకించి విజయవాడ ఎంపీ కేశినేని చిన్నిపై వైసీపీ నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. "రెడ్ బుక్లో పేజీలు చింపితే చిరిగిపోతాయి, కానీ మా దగ్గర డిజిటల్ బుక్ ఉంది, గుర్తుపెట్టుకోండి" అంటూ ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాశ్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. జగన్ జోలికి వస్తే చిన్ని నీచమైన బతుకును బయటపెడతామని వ్యాఖ్యానించారు.
ఎన్టీఆర్ జిల్లా వైసీపీ విస్తృతస్థాయి సమావేశంలో దేవినేని అవినాశ్ మాట్లాడుతూ, ఎంపీ అంటే 'మనీ ప్యాకింగ్ సర్వీస్'గా మారిపోయిందని ఎద్దేవా చేశారు. విజయవాడ ఉత్సవాల పేరుతో ఎంపీ పెద్దఎత్తున దోచుకున్నారని, హైదరాబాద్లో అనేక స్కామ్లకు పాల్పడ్డారని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పేదలకు ఆనందం కరవైందని, సంక్షేమం, అభివృద్ధిని పూర్తిగా పక్కనపెట్టేశారని విమర్శించారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా కార్యకర్తలు పార్టీకి అండగా ఉన్నారని, 2029లో వైసీపీ అధికారంలోకి రావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
అంతకుముందు, ఈ సమావేశంలో పాల్గొన్న వైసీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ, జగన్ ఎంతో దూరదృష్టితో రాష్ట్రంలో 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుడితే, ప్రస్తుత ప్రభుత్వం వాటిని ప్రైవేటుపరం చేసేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. పేదలకు విద్య, వైద్యం అందుబాటులో ఉండాలన్నదే జగన్ లక్ష్యమని, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళతామని స్పష్టం చేశారు.
కల్తీ మద్యం ఫ్యాక్టరీలు పెట్టింది కూటమి ప్రభుత్వమేనని, కానీ నిందలు మాత్రం వైసీపీపై వేస్తున్నారని సుబ్బారెడ్డి మండిపడ్డారు. వర్షాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నా, డయేరియా బాధితులను పట్టించుకోకపోయినా ప్రభుత్వం మీడియాను అడ్డుపెట్టుకుని వాస్తవాలను కప్పిపుచ్చుతోందని విమర్శించారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై కోటి సంతకాలు సేకరించి పోరాడతామని ఆయన ప్రకటించారు. కార్యకర్తలపై పెడుతున్న అక్రమ కేసులకు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని, పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. త్వరలోనే గ్రామ, మండల స్థాయి కమిటీలతో పాటు 29 అనుబంధ విభాగాల నియామకాలు పూర్తిచేస్తామని సుబ్బారెడ్డి తెలిపారు.
ఎన్టీఆర్ జిల్లా వైసీపీ విస్తృతస్థాయి సమావేశంలో దేవినేని అవినాశ్ మాట్లాడుతూ, ఎంపీ అంటే 'మనీ ప్యాకింగ్ సర్వీస్'గా మారిపోయిందని ఎద్దేవా చేశారు. విజయవాడ ఉత్సవాల పేరుతో ఎంపీ పెద్దఎత్తున దోచుకున్నారని, హైదరాబాద్లో అనేక స్కామ్లకు పాల్పడ్డారని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పేదలకు ఆనందం కరవైందని, సంక్షేమం, అభివృద్ధిని పూర్తిగా పక్కనపెట్టేశారని విమర్శించారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా కార్యకర్తలు పార్టీకి అండగా ఉన్నారని, 2029లో వైసీపీ అధికారంలోకి రావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
అంతకుముందు, ఈ సమావేశంలో పాల్గొన్న వైసీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ, జగన్ ఎంతో దూరదృష్టితో రాష్ట్రంలో 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుడితే, ప్రస్తుత ప్రభుత్వం వాటిని ప్రైవేటుపరం చేసేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. పేదలకు విద్య, వైద్యం అందుబాటులో ఉండాలన్నదే జగన్ లక్ష్యమని, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళతామని స్పష్టం చేశారు.
కల్తీ మద్యం ఫ్యాక్టరీలు పెట్టింది కూటమి ప్రభుత్వమేనని, కానీ నిందలు మాత్రం వైసీపీపై వేస్తున్నారని సుబ్బారెడ్డి మండిపడ్డారు. వర్షాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నా, డయేరియా బాధితులను పట్టించుకోకపోయినా ప్రభుత్వం మీడియాను అడ్డుపెట్టుకుని వాస్తవాలను కప్పిపుచ్చుతోందని విమర్శించారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై కోటి సంతకాలు సేకరించి పోరాడతామని ఆయన ప్రకటించారు. కార్యకర్తలపై పెడుతున్న అక్రమ కేసులకు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని, పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. త్వరలోనే గ్రామ, మండల స్థాయి కమిటీలతో పాటు 29 అనుబంధ విభాగాల నియామకాలు పూర్తిచేస్తామని సుబ్బారెడ్డి తెలిపారు.