పారిశ్రామిక పార్కుల అభివృద్ధిలో భాగస్వాములు కండి: ఈఎస్ఆర్కు లోకేశ్ పిలుపు
- ముంబైలో కొనసాగుతున్న మంత్రి నారా లోకేశ్ పర్యటన
- ఈఎస్ఆర్ గ్రూప్ ప్రతినిధులతో భేటీ
- పోర్టుల వద్ద భారీ లాజిస్టిక్స్ పార్కుల ఏర్పాటుకు ప్రతిపాదన
- రొయ్యల పరిశ్రమ కోసం కోల్డ్ చైన్ రంగంలో పెట్టుబడులకు పిలుపు
- విశాఖ, కాకినాడ, తిరుపతి మార్గాల్లో మెగా ఇండస్ట్రియల్ పార్కుల అభివృద్ధి
ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామిక, లాజిస్టిక్స్ రంగాల్లో భారీ పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ముంబైలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా, ఆయన గ్లోబల్ రియల్ ఎస్టేట్ దిగ్గజం ఈఎస్ఆర్ గ్రూప్ ప్రతినిధులతో సోమవారం నాడు సమావేశమయ్యారు. రాష్ట్రంలో పారిశ్రామిక పార్కుల అభివృద్ధిలో భాగస్వాములు కావాలని వారిని ఆహ్వానించారు.
ముంబైలోని తాజ్ ల్యాండ్స్ హోటల్లో జరిగిన ఈ భేటీలో ఈఎస్ఆర్ గ్రూప్ ఇండియా ఇన్వెస్ట్మెంట్స్ హెడ్ సాదత్ షా, లీజింగ్ డైరెక్టర్ ప్రకృత్ మెహతా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీలో పెట్టుబడులకు ఉన్న అపార అవకాశాలను లోకేశ్ వారికి వివరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఆమోదించిన 'ప్లగ్ అండ్ ప్లే ఇండస్ట్రియల్ పార్క్స్ పాలసీ 4.0' పెట్టుబడిదారులకు ఎంతో అనుకూలంగా ఉందని తెలిపారు. విశాఖపట్నం, కాకినాడ, తిరుపతి కారిడార్లలో వెయ్యి ఎకరాలకు పైగా విస్తీర్ణంలో మెగా ఇండస్ట్రియల్ పార్కులను ప్రభుత్వం అభివృద్ధి చేస్తోందని, ఏపీఐఐసీతో కలిసి ఈ పార్కుల నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఆయన ఈఎస్ఆర్ గ్రూప్ను కోరారు.
రాష్ట్రంలోని పోర్టులకు సమీపంలో 3 నుంచి 5 భారీ లాజిస్టిక్స్ పార్కులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోందని లోకేశ్ వెల్లడించారు. ముఖ్యంగా విశాఖపట్నం, కాకినాడ పోర్టుల వద్ద మల్టీమోడల్ లాజిస్టిక్స్ పార్కుల ఏర్పాటుకు ముందుకు రావాలని సూచించారు. దేశంలోనే 70 శాతం రొయ్యల ఉత్పత్తి ఏపీలోనే జరుగుతున్నందున, కోల్డ్ చైన్ మౌలిక సదుపాయాల రంగంలో పెట్టుబడులకు మంచి అవకాశాలు ఉన్నాయని ఆయన నొక్కి చెప్పారు. సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల కోసం కంటైనర్ ఫ్రైట్ స్టేషన్లు, గిడ్డంగుల నిర్మాణంలో కూడా పెట్టుబడులు పెట్టాలని విజ్ఞప్తి చేశారు.
ఈఎస్ఆర్ గ్రూప్ ఆసియా-పసిఫిక్లో 154 బిలియన్ డాలర్ల ఆస్తులను, భారత్లో 1.7 బిలియన్ డాలర్ల ఆస్తులను నిర్వహిస్తోంది.
ముంబైలోని తాజ్ ల్యాండ్స్ హోటల్లో జరిగిన ఈ భేటీలో ఈఎస్ఆర్ గ్రూప్ ఇండియా ఇన్వెస్ట్మెంట్స్ హెడ్ సాదత్ షా, లీజింగ్ డైరెక్టర్ ప్రకృత్ మెహతా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీలో పెట్టుబడులకు ఉన్న అపార అవకాశాలను లోకేశ్ వారికి వివరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఆమోదించిన 'ప్లగ్ అండ్ ప్లే ఇండస్ట్రియల్ పార్క్స్ పాలసీ 4.0' పెట్టుబడిదారులకు ఎంతో అనుకూలంగా ఉందని తెలిపారు. విశాఖపట్నం, కాకినాడ, తిరుపతి కారిడార్లలో వెయ్యి ఎకరాలకు పైగా విస్తీర్ణంలో మెగా ఇండస్ట్రియల్ పార్కులను ప్రభుత్వం అభివృద్ధి చేస్తోందని, ఏపీఐఐసీతో కలిసి ఈ పార్కుల నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఆయన ఈఎస్ఆర్ గ్రూప్ను కోరారు.
రాష్ట్రంలోని పోర్టులకు సమీపంలో 3 నుంచి 5 భారీ లాజిస్టిక్స్ పార్కులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోందని లోకేశ్ వెల్లడించారు. ముఖ్యంగా విశాఖపట్నం, కాకినాడ పోర్టుల వద్ద మల్టీమోడల్ లాజిస్టిక్స్ పార్కుల ఏర్పాటుకు ముందుకు రావాలని సూచించారు. దేశంలోనే 70 శాతం రొయ్యల ఉత్పత్తి ఏపీలోనే జరుగుతున్నందున, కోల్డ్ చైన్ మౌలిక సదుపాయాల రంగంలో పెట్టుబడులకు మంచి అవకాశాలు ఉన్నాయని ఆయన నొక్కి చెప్పారు. సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల కోసం కంటైనర్ ఫ్రైట్ స్టేషన్లు, గిడ్డంగుల నిర్మాణంలో కూడా పెట్టుబడులు పెట్టాలని విజ్ఞప్తి చేశారు.
ఈఎస్ఆర్ గ్రూప్ ఆసియా-పసిఫిక్లో 154 బిలియన్ డాలర్ల ఆస్తులను, భారత్లో 1.7 బిలియన్ డాలర్ల ఆస్తులను నిర్వహిస్తోంది.