Pawan Kalyan: ఈ నెలలో పవన్ కల్యాణ్ జిల్లాల పర్యటనలతో బిజీ

ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ క్షేత్రస్థాయి పర్యటనలకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఈ నెలలో ఆయన పలు జిల్లాల్లో పర్యటించనున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలోని గురుకుల పాఠశాలలో పలువురు విద్యార్థినులు అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, తన పర్యటనను అక్కడి నుంచే ప్రారంభించాలని పవన్ నిర్ణయించారు. కురుపాం వెళ్లి ఆ పాఠశాలను పరిశీలించడంతో పాటు, విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకోనున్నారు.

ఈ పర్యటనలో భాగంగా ఆయన తన సొంత నియోజకవర్గమైన పిఠాపురంతో పాటు ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో కూడా పర్యటించనున్నారు. అలాగే, తన శాఖకు సంబంధించిన ఒక ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొనేందుకు రాజోలు నియోజకవర్గానికి వెళ్లనున్నారు. పర్యటనల సమయంలో మొదట అధికారిక కార్యక్రమాల్లో పాల్గొని, ఆ తర్వాత స్థానిక జనసేన నాయకులు, జన సైనికులు, వీర మహిళలతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు.

ప్రస్తుతం ఈ పర్యటనలకు సంబంధించిన షెడ్యూల్ రూపకల్పన జరుగుతోందని, త్వరలోనే తేదీలను అధికారికంగా ఖరారు చేస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. 
Pawan Kalyan
Pawan Kalyan tour
Andhra Pradesh
Pithapuram
Kurupam
Janaseana
Panchayat Raj
AP News
Nellore
Prakasam

More Telugu News