చంద్రబాబు, నారా లోకేశ్ లకు కృతజ్ఞతలు తెలిపిన పవన్ కల్యాణ్
- తన ఆరోగ్యంపై వారు చూపిన ఆందోళనకు ధన్యవాదాలు
- సోషల్ మీడియా వేదికగా స్పందించిన పవన్ కల్యాణ్
- ‘ఓజీ’ విజయంపై అభినందించినందుకు చంద్రబాబుకు ప్రత్యేక కృతజ్ఞతలు
- ఆదరణ చూపినందుకు నారా లోకేశ్ కు కూడా ధన్యవాదాలు
- గవర్నర్ శుభాకాంక్షలకు పవన్ హృదయపూర్వక స్పందన
గవర్నర్ అబ్దుల్ నజీర్ తన ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేయడంతో పాటు శుభాకాంక్షలు తెలిపారని, వారి ఆదరణకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నట్లు పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
అదేవిధంగా, ముఖ్యమంత్రి చంద్రబాబు తన ఆరోగ్యం గురించి వాకబు చేశారని పవన్ వెల్లడించారు. అంతటితో ఆగకుండా, తన తాజా చిత్రం ‘ఓజీ’ విజయం పట్ల ప్రత్యేకంగా అభినందనలు తెలిపారని పేర్కొన్నారు. ఈ ఆదరణ, అభినందనలకు గాను ముఖ్యమంత్రి చంద్రబాబుకు పవన్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
అలాగే, తన పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ పంపిన సందేశానికి గాను నారా లోకేశ్ కు కూడా పవన్ కల్యాణ్ ధన్యవాదాలు చెప్పారు. గత నాలుగు రోజులుగా వైరల్ జ్వరంతో బాధపడుతున్నపవన్ కల్యాణ్ త్వరగా కోలుకోవాలని పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు ఆకాంక్షించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే గవర్నర్, ముఖ్యమంత్రి, లోకేశ్ ల పరామర్శలకు పవన్ ఈ విధంగా స్పందించారు.