ప్రజల సొమ్ముతో పండుగ కానుకలు వద్దు.. కేంద్ర ఆర్థిక శాఖ కీలక ఆదేశాలు
- దీపావళి సందర్భంగా ఆర్థిక శాఖ నిర్ణయం
- మంత్రిత్వ శాఖలకు తాజాగా ఆదేశాల జారీ
- ఆర్థిక క్రమశిక్షణ కోసమే నిర్ణయమని వెల్లడి
ప్రజావనరులను మరింత సమర్థవంతంగా వినియోగించేలా ప్రభుత్వ విభాగాలకు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఎప్పటికప్పుడు మార్గదర్శకాలు జారీ చేస్తుంది. ఇందులో భాగంగానే తాజాగా ఈ నోటీసులు పంపింది. ఆర్థిక క్రమశిక్షణను ప్రోత్సహించడం, అనవసర ఖర్చులను నియంత్రించడంపై ఆర్థిక శాఖ వ్యయ విభాగం దృష్టి సారించింది. ఈ నేపథ్యంలోనే దీపావళి సహా ఇతర పండగలకు బహుమతుల కోసం మంత్రిత్వ శాఖలు ఎలాంటి ఖర్చు చేయరాదని నోటీసుల్లో పేర్కొంది.