విజయ్ కి 'వై-ప్లస్' సెక్యూరిటీ.. అయినా తప్పని భద్రతా వైఫల్యం.. అసలేం జరిగింది?
రాజకీయాల్లోకి ప్రవేశించి, కేంద్ర ప్రభుత్వం నుంచి వై-ప్లస్ కేటగిరీ భద్రత పొందిన ప్రముఖ నటుడు, తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధ్యక్షుడు విజయ్ ఇంట్లో భద్రతా వైఫల్యం చోటుచేసుకుంది. చెన్నైలోని నీలంకరైలో ఉన్న ఆయన నివాసంలోకి ఓ యువకుడు ప్రవేశించి కలకలం సృష్టించాడు. ఇంటి టెర్రస్పై తిరుగుతున్న అతడిని గమనించిన భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమై పట్టుకున్నారు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో ఆ యువకుడి పేరు అరుణ్ (24) అని, అతడు గత నాలుగేళ్లుగా మానసిక సమస్యలతో బాధపడుతున్నాడని ప్రాథమికంగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం అతడిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో విజయ్ అభిమానులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఆయనకు భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని సోషల్ మీడియా వేదికగా కోరుతున్నారు.
విజయ్ రాజకీయ రంగ ప్రవేశం నేపథ్యంలో ఆయన భద్రతపై ఆందోళనలు వ్యక్తమవడంతో ఈ ఏడాది ఫిబ్రవరిలో కేంద్ర హోం శాఖ ఆయనకు వై-ప్లస్ కేటగిరీ భద్రతను మంజూరు చేసింది. ఈ భద్రతా వ్యవస్థలో భాగంగా మొత్తం 11 మంది సిబ్బంది షిఫ్టుల వారీగా రక్షణ కల్పిస్తారు. వారిలో ఇద్దరు నుంచి నలుగురు కమాండోలతో పాటు పోలీస్ సిబ్బంది కూడా ఉంటారు. ఇంతటి పటిష్ఠమైన భద్రత ఉన్నప్పటికీ, ఓ వ్యక్తి ఇంట్లోకి చొరబడటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
గతేడాది ‘తమిళగ వెట్రి కళగం’ పేరుతో విజయ్ తన రాజకీయ పార్టీని ప్రకటించిన విషయం తెలిసిందే. రాబోయే 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని ఆయన ఇప్పటికే స్పష్టం చేశారు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో ఆ యువకుడి పేరు అరుణ్ (24) అని, అతడు గత నాలుగేళ్లుగా మానసిక సమస్యలతో బాధపడుతున్నాడని ప్రాథమికంగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం అతడిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో విజయ్ అభిమానులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఆయనకు భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని సోషల్ మీడియా వేదికగా కోరుతున్నారు.
విజయ్ రాజకీయ రంగ ప్రవేశం నేపథ్యంలో ఆయన భద్రతపై ఆందోళనలు వ్యక్తమవడంతో ఈ ఏడాది ఫిబ్రవరిలో కేంద్ర హోం శాఖ ఆయనకు వై-ప్లస్ కేటగిరీ భద్రతను మంజూరు చేసింది. ఈ భద్రతా వ్యవస్థలో భాగంగా మొత్తం 11 మంది సిబ్బంది షిఫ్టుల వారీగా రక్షణ కల్పిస్తారు. వారిలో ఇద్దరు నుంచి నలుగురు కమాండోలతో పాటు పోలీస్ సిబ్బంది కూడా ఉంటారు. ఇంతటి పటిష్ఠమైన భద్రత ఉన్నప్పటికీ, ఓ వ్యక్తి ఇంట్లోకి చొరబడటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
గతేడాది ‘తమిళగ వెట్రి కళగం’ పేరుతో విజయ్ తన రాజకీయ పార్టీని ప్రకటించిన విషయం తెలిసిందే. రాబోయే 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని ఆయన ఇప్పటికే స్పష్టం చేశారు.