Nellore road accident: కారును ఢీ కొట్టిన టిప్పర్.. నెల్లూరు జిల్లాలో ఏడుగురు దుర్మరణం

Nellore Road Accident Seven Dead in Tipper Car Collision
––
రాంగ్ రూట్ లో దూసుకు వచ్చిన ఓ టిప్పర్ లారీ ఎదురుగా వస్తున్న కారును ఢీ కొట్టింది. దీంతో కారులోని ఏడుగురు ప్రయాణికులు అక్కడికక్కడే చనిపోయారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఈ రోజు ఉదయం చోటుచేసుకుందీ ఘోర ప్రమాదం. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సంగం మండలం పెరమన వద్ద జాతీయ రహదారిపై ఈ ఘోర ప్రమాదం జరిగింది. కారు నెల్లూరు నుంచి కడప వైపు వెళుతుండగా, టిప్పర్ రాంగ్ రూట్ లో వేగంగా రావటం వల్లే ఈ ప్రమాదం సంభవించిందని ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్నారు.

కారును ఢీకొట్టిన అనంతరం టిప్పర్ కొంత దూరం వరకు కారును ఈడ్చుకెళ్లిందని స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఓ చిన్నారితో పాటు ఏడుగురు ప్రయాణికులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారని విచారం వ్యక్తం చేశారు. టిప్పర్ కింద చిక్కుకోవడంతో కారులోని ప్రయాణికుల శరీరాలు నుజ్జునుజ్జయ్యాయని పోలీసులు తెలిపారు. స్థానికుల సమాచారంతో వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. కాగా, ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Nellore road accident
Nellore district
Andhra Pradesh accident
Tipper lorry accident
Car accident
Road safety India
Peramana village
Sanga mandalam
National highway accident
Seven dead

More Telugu News