Suryakumar Yadav: ఆసియా కప్ సమరం... భారత్ పై టాస్ గెలిచిన పాకిస్థాన్

Suryakumar Yadav led India to field first after Pakistan won the toss
  • ఆసియా కప్ 2025లో భారత్, పాకిస్థాన్ కీలక పోరు
  • టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్
  • దుబాయ్ అంతర్జాతీయ స్టేడియం ఈ మ్యాచ్‌కు వేదిక
యావత్ క్రికెట్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. ఆసియా కప్ 2025లో భాగంగా దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న ఈ కీలకమైన గ్రూప్-ఏ మ్యాచ్‌లో పాకిస్థాన్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకుంది. దీంతో, సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని భారత జట్టు తొలుత ఫీల్డింగ్ చేయనుంది.

ఈ హైవోల్టేజ్ మ్యాచ్‌లో టీమిండియాకు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్‌గా వ్యవహరిస్తుండగా, పాకిస్థాన్ జట్టుకు సల్మాన్ ఆఘా నాయకత్వం వహిస్తున్నాడు. పిచ్ పరిస్థితులను అంచనా వేసి, ముందుగా బోర్డుపై భారీ స్కోరు ఉంచడం ద్వారా భారత్‌పై ఒత్తిడి పెంచాలనే వ్యూహంతో పాకిస్థాన్ బరిలోకి దిగుతోంది.

ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు తమ తుది జట్లను ప్రకటించాయి. భారత జట్టులో అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్ ఓపెనర్లుగా రానుండగా, సంజూ శాంసన్ వికెట్ కీపింగ్ బాధ్యతలు చేపట్టనున్నాడు. పాకిస్థాన్ జట్టులోనూ కీలక ఆటగాళ్లతో పటిష్టంగా కనిపిస్తోంది. ఓవైపు భారత్ లో తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో, ఈ మ్యాచ్ జరుగుతుండడం గమనార్హం. పహాల్గమ్ ఉగ్రదాడిలో 26 మంది మరణించారని, భారత్ ఈ మ్యాచ్ ను బహిష్కరించాలన్న డిమాండ్లు బలంగా వినిపిస్తున్నాయి. 

తుది జట్ల వివరాలు

భారత్: అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి.

పాకిస్థాన్: సాహిబ్జాదా ఫర్హాన్, సయీమ్ అయూబ్, మహమ్మద్ హారిస్ (వికెట్ కీపర్), ఫఖర్ జమాన్, సల్మాన్ అఘా (కెప్టెన్), హసన్ నవాజ్, మహమ్మద్ నవాజ్, ఫహీమ్ అష్రఫ్, షాహీన్ అఫ్రిది, సూఫియాన్ ముఖీమ్, అబ్రార్ అహ్మద్.
Suryakumar Yadav
India vs Pakistan
Asia Cup 2025
Dubai Cricket Stadium
Salman Agha
Cricket Match
Indian Cricket Team
Pakistan Cricket Team
Abhishek Sharma
Shubman Gill

More Telugu News