Chandrababu Naidu: చంద్రబాబు తిరుపతి పర్యటన రద్దు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరుపతి పర్యటన అనూహ్యంగా రద్దయింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఆయన తిరుపతిలో జరగనున్న మహిళా సాధికారత సదస్సులో పాల్గొనాల్సి ఉండగా, వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో పర్యటనను విరమించుకున్నారు.

వివరాల్లోకి వెళ్తే, ముఖ్యమంత్రి ప్రయాణించాల్సిన అమరావతి-తిరుపతి మార్గంలో ఆకాశం దట్టమైన మేఘాలతో నిండిపోయింది. ఈ పరిస్థితుల్లో ప్రయాణం సురక్షితం కాదని భావించిన ఏవియేషన్ అధికారులు, సీఎం ప్రయాణానికి క్లియరెన్స్ ఇచ్చేందుకు నిరాకరించారు. దీంతో ఆయన పర్యటన చివరి నిమిషంలో రద్దయినట్లు ప్రభుత్వ వర్గాలు అధికారికంగా వెల్లడించాయి.

తిరుపతిలో ఏర్పాటు చేసిన మహిళా సాధికారత సదస్సులో ముఖ్యమంత్రి పాల్గొని ప్రసంగించాల్సి ఉంది. అయితే, వాతావరణం అడ్డంకిగా మారడంతో ఆయన ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోయారు.
Chandrababu Naidu
Chandrababu
Tirupati
Andhra Pradesh
AP CM
Women Empowerment Conference
Amaravati
Tirupati Tour Cancelled
Weather Conditions
Aviation Clearance

More Telugu News