Pawan Kalyan: అటవీ సిబ్బందిపై ఏనుగు దాడి.. వెంటనే స్పందించిన పవన్ కల్యాణ్

Pawan Kalyan Responds to Elephant Attack on Forest Staff
షార్ట్స్‌లో చూడండి
చిత్తూరు జిల్లా పలమనేరులో ఏనుగు దాడిలో గాయపడిన అటవీ శాఖ సిబ్బందికి తక్షణం అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ ఉన్నతాధికారులను ఆదేశించారు. విధి నిర్వహణలో గాయపడిన ఉద్యోగుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన స్పష్టం చేశారు.

శనివారం చిరుతపల్లి అటవీ ప్రాంతం నుంచి ఓ ఏనుగు దారి తప్పి పలమనేరు పట్టణ సమీపంలోని జనావాసాల్లోకి ప్రవేశించింది. దీంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. సమాచారం అందుకున్న అటవీ శాఖ సిబ్బంది, పోలీసులు కలిసి ఏనుగును తిరిగి అడవిలోకి పంపేందుకు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో ఏనుగు ఒక్కసారిగా వారిపైకి ఎదురుదాడికి దిగింది. ఈ ఘటనలో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ (ఎఫ్ఎస్ఓ) సుకుమార్, ఏనుగుల ట్రాకర్ హరిబాబులకు తీవ్ర గాయాలయ్యాయి. అయినప్పటికీ, సిబ్బంది ధైర్యంగా వ్యవహరించి ఏనుగును విజయవంతంగా అడవిలోకి మళ్లించారు.

ఈ విషయం తెలుసుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వెంటనే అటవీ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. గాయపడిన సుకుమార్, హరిబాబుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వారికి మెరుగైన చికిత్స అందేలా చూడాలని పీసీసీఎఫ్ పి.వి. చలపతిరావుకు ఫోన్‌లో సూచించారు. "ఏనుగుల కదలికలపై రానున్న కొన్ని రోజుల పాటు నిరంతరం అప్రమత్తంగా ఉండాలి. వాటి కదలికలను నిశితంగా గమనించాలి. ప్రజల భద్రతకు ఎలాంటి ముప్పు వాటిల్లకుండా చూడాలి" అని ఆయన అధికారులకు దిశానిర్దేశం చేశారు. అవసరమైతే పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు శిక్షణ పొందిన కుంకీ ఏనుగులతో గస్తీ నిర్వహించాలని కూడా ఆయన సూచించారు.
Go Back to Shorts
Pawan Kalyan
Pawan Kalyan forest staff attack
Chittoor district
Palamaneru
Elephant attack
Forest officials
Andhra Pradesh forest department
PV Chalapathi Rao
Forest safety

More Telugu News