SBI: ఎస్బీఐలో బాలుడి చేతివాటం.. కౌంటర్ నుంచి రూ. 5 లక్షలు మాయం
- నిజామాబాద్ జిల్లా బోధన్ ఎస్బీఐలో ఘటన
- బ్యాంకు కౌంటర్ నుంచి రూ. 5 లక్షల నగదు అపహరణ
- దొంగతనం చేసింది ఓ బాలుడని సీసీ ఫుటేజీలో గుర్తింపు
- బాలుడికి మరో ఇద్దరు సహకరించినట్లు పోలీసుల అనుమానం
- నిందితుల కోసంగాలిస్తున్న పోలీసులు
నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని ఎస్బీఐ శాఖలో జరిగిన ఓ భారీ చోరీ కేసు పోలీసులను ఆశ్చర్యానికి గురిచేసింది. బ్యాంకు క్యాష్ కౌంటర్ నుంచి ఏకంగా రూ. 5 లక్షల నగదును ఓ బాలుడు చాకచక్యంగా అపహరించినట్లు సీసీ కెమెరా ఫుటేజీలో స్పష్టమైంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళితే.. ఈ నెల 8వ తేదీన తమ బ్యాంకులో రూ. 5 లక్షల నగదు కనిపించడం లేదని క్యాషియర్ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తులో భాగంగా బ్యాంకులోని సీసీ కెమెరా దృశ్యాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఆ ఫుటేజీలో కనిపించిన దృశ్యాలు చూసి వారు విస్తుపోయారు. బ్యాంకులో ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతుండగా, ఓ బాలుడు నేరుగా నగదు కౌంటర్ వద్దకు వెళ్లి అక్కడ ఉన్న రూ. 5 లక్షల నగదును దొంగిలించినట్లు గుర్తించారు.
ఈ చోరీ వెనుక పెద్దల హస్తం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. బాలుడికి సహకరించిన మిగతా ఇద్దరిని గుర్తించేందుకు సీసీ ఫుటేజీ ఆధారంగా విచారణను ముమ్మరం చేశారు. ఈ ఘటనపై పట్టణ సీఐ మాట్లాడుతూ, అన్ని కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నామని, నిందితులను త్వరలోనే పట్టుకుని చట్టం ముందు నిలబెడతామని భరోసా ఇచ్చారు. పట్టపగలు బ్యాంకులో బాలుడు ఇంత పెద్ద మొత్తంలో నగదును దొంగిలించడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
వివరాల్లోకి వెళితే.. ఈ నెల 8వ తేదీన తమ బ్యాంకులో రూ. 5 లక్షల నగదు కనిపించడం లేదని క్యాషియర్ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తులో భాగంగా బ్యాంకులోని సీసీ కెమెరా దృశ్యాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఆ ఫుటేజీలో కనిపించిన దృశ్యాలు చూసి వారు విస్తుపోయారు. బ్యాంకులో ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతుండగా, ఓ బాలుడు నేరుగా నగదు కౌంటర్ వద్దకు వెళ్లి అక్కడ ఉన్న రూ. 5 లక్షల నగదును దొంగిలించినట్లు గుర్తించారు.
ఈ చోరీ వెనుక పెద్దల హస్తం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. బాలుడికి సహకరించిన మిగతా ఇద్దరిని గుర్తించేందుకు సీసీ ఫుటేజీ ఆధారంగా విచారణను ముమ్మరం చేశారు. ఈ ఘటనపై పట్టణ సీఐ మాట్లాడుతూ, అన్ని కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నామని, నిందితులను త్వరలోనే పట్టుకుని చట్టం ముందు నిలబెడతామని భరోసా ఇచ్చారు. పట్టపగలు బ్యాంకులో బాలుడు ఇంత పెద్ద మొత్తంలో నగదును దొంగిలించడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.