భారతీయుల వీసాలపై వివాదాస్పద వ్యాఖ్యలు.. వారం తిరక్కముందే చార్లీ కిర్క్ హత్య
- ఉటాలో బహిరంగ సభలో ప్రసంగిస్తుండగా చార్లీ కిర్క్ మెడపై కాల్పులు
- భారతీయులకు వీసాలు ఆపేయాలని కిర్క్ డిమాండ్
- నిందితుడి కోసం కొనసాగుతున్న ఎఫ్బీఐ గాలింపు చర్యలు
- చిన్న వయసులోనే ట్రంప్కు కీలక మద్దతుదారుగా గుర్తింపు
అమెరికాలో సంచలనం సృష్టించిన రాజకీయ నేత, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సన్నిహితుడు చార్లీ కిర్క్ (31) దారుణ హత్యకు గురయ్యారు. భారతీయులకు వీసాలు ఇవ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ కొన్ని రోజుల క్రితమే ఆయన చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపిన నేపథ్యంలో ఈ ఘటన జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది.
వివరాల్లోకి వెళితే.. బుధవారం ఉటా వ్యాలీ యూనివర్సిటీలో జరిగిన ఓ బహిరంగ కార్యక్రమంలో చార్లీ కిర్క్ ప్రసంగిస్తుండగా ఈ దాడి జరిగింది. ఓ దుండగుడు ఆయన మెడపై కాల్పులు జరపడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ, అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. చిన్న వయసులోనే కన్జర్వేటివ్ పార్టీలో క్రియాశీలక నేతగా, ట్రంప్కు కీలక మద్దతుదారుగా కిర్క్ గుర్తింపు పొందారు.
ఈ నెల 2వ తేదీన చార్లీ కిర్క్ భారతీయులకు వీసాలపై తన వ్యతిరేకతను బయటపెట్టారు. భారత్తో వాణిజ్య ఒప్పందంలో భాగంగా మరిన్ని వీసాలు మంజూరు చేయాల్సి రావచ్చని ఓ ఫాక్స్ న్యూస్ యాంకర్ చేసిన పోస్టుపై ఆయన స్పందించారు. "భారత్ నుంచి వస్తున్న వలసల వల్లే అమెరికా ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారు" అని ఆయన 'ఎక్స్' (ట్విట్టర్) లో పోస్ట్ చేశారు. అంతటితో ఆగకుండా "ఇక చాలు. మన దేశం నిండిపోయింది. మన ప్రజలకే తొలి ప్రాధాన్యం ఇద్దాం" అని ఆయన వ్యాఖ్యానించారు.
ఈ వ్యాఖ్యలు చేసిన వారం తిరక్కముందే ఆయన హత్యకు గురికావడం పలు అనుమానాలకు తావిస్తోంది. హత్యకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కాల్పులు జరగగానే కిర్క్ తన మెడను పట్టుకుని కుర్చీలోంచి కిందపడిపోవడం ఆ వీడియోల్లో కనిపించింది. నిందితుడు ఇంకా పరారీలోనే ఉన్నాడని, అతడిని పట్టుకునేందుకు ఎఫ్బీఐ అధికారులు ముమ్మర దర్యాప్తు చేస్తున్నారని అధికారులు తెలిపారు.
వివరాల్లోకి వెళితే.. బుధవారం ఉటా వ్యాలీ యూనివర్సిటీలో జరిగిన ఓ బహిరంగ కార్యక్రమంలో చార్లీ కిర్క్ ప్రసంగిస్తుండగా ఈ దాడి జరిగింది. ఓ దుండగుడు ఆయన మెడపై కాల్పులు జరపడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ, అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. చిన్న వయసులోనే కన్జర్వేటివ్ పార్టీలో క్రియాశీలక నేతగా, ట్రంప్కు కీలక మద్దతుదారుగా కిర్క్ గుర్తింపు పొందారు.
ఈ నెల 2వ తేదీన చార్లీ కిర్క్ భారతీయులకు వీసాలపై తన వ్యతిరేకతను బయటపెట్టారు. భారత్తో వాణిజ్య ఒప్పందంలో భాగంగా మరిన్ని వీసాలు మంజూరు చేయాల్సి రావచ్చని ఓ ఫాక్స్ న్యూస్ యాంకర్ చేసిన పోస్టుపై ఆయన స్పందించారు. "భారత్ నుంచి వస్తున్న వలసల వల్లే అమెరికా ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారు" అని ఆయన 'ఎక్స్' (ట్విట్టర్) లో పోస్ట్ చేశారు. అంతటితో ఆగకుండా "ఇక చాలు. మన దేశం నిండిపోయింది. మన ప్రజలకే తొలి ప్రాధాన్యం ఇద్దాం" అని ఆయన వ్యాఖ్యానించారు.
ఈ వ్యాఖ్యలు చేసిన వారం తిరక్కముందే ఆయన హత్యకు గురికావడం పలు అనుమానాలకు తావిస్తోంది. హత్యకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కాల్పులు జరగగానే కిర్క్ తన మెడను పట్టుకుని కుర్చీలోంచి కిందపడిపోవడం ఆ వీడియోల్లో కనిపించింది. నిందితుడు ఇంకా పరారీలోనే ఉన్నాడని, అతడిని పట్టుకునేందుకు ఎఫ్బీఐ అధికారులు ముమ్మర దర్యాప్తు చేస్తున్నారని అధికారులు తెలిపారు.