Tincho: చైనాలో తన ల్యాప్‌టాప్‌ను పబ్లిక్ లో వదిలేసి వెళ్లిన ఇన్‌ఫ్లుయెన్సర్.. ఆ తర్వాతేం జరిగింది?

Tincho leaves laptop in China public place social experiment
షార్ట్స్‌లో చూడండి
జనసమ్మర్దం ఉన్న ప్రదేశంలో ఒక ఖరీదైన ల్యాప్‌టాప్‌ను అరగంట పాటు వదిలేస్తే ఏమవుతుంది? కచ్చితంగా మాయమవుతుందని చాలామంది అనుకుంటారు. కానీ చైనాలో ఓ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌కు పూర్తి భిన్నమైన అనుభవం ఎదురైంది. అక్కడి ప్రజా భద్రత, ప్రజల నమ్మకాన్ని పరీక్షించేందుకు అతను చేసిన ఓ ప్రయోగం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వైరల్‌గా మారింది.

టించో అనే సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ఇటీవల చైనాలో ఈ సామాజిక ప్రయోగాన్ని నిర్వహించాడు. ఒక పబ్లిక్ ప్రదేశంలో తన ల్యాప్‌టాప్‌ను టేబుల్‌పై పెట్టి, 30 నిమిషాల పాటు దాన్ని అక్కడే వదిలేసి వెళ్లాడు. ఆశ్చర్యకరంగా, తిరిగి వచ్చి చూసేసరికి ల్యాప్‌టాప్‌ను ఎవరూ దొంగిలించలేదు, కనీసం ముట్టుకోలేదు కూడా. ఈ మొత్తం ఘటనను వీడియో తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. "పారిస్‌లో అయితే ఇలాంటిది ఊహించుకోవడం కూడా కష్టం. కానీ చైనాలో భద్రత, ప్రజా నమ్మకం చాలా భిన్నంగా ఉన్నాయి" అని తన పోస్ట్‌లో పేర్కొన్నాడు.

ఇది తన అజాగ్రత్త కాదని, చైనాలోని సామాజిక పరిస్థితులను, తక్కువ నేరాల రేటును గమనించడానికే ఈ ప్రయోగం చేశానని టించో వివరించాడు. "ఈ ప్రయోగం కేవలం అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి కాదు, ఇక్కడి భద్రత, సామాజిక నిబంధనలు ఎలా ఉన్నాయో అనుభవపూర్వకంగా తెలుసుకోవడానికే" అని అతను తెలిపాడు.

ఈ వీడియో ఆన్‌లైన్‌లో పెద్ద చర్చకు దారితీసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న నెటిజన్లు తమ దేశాల్లోని పరిస్థితులతో పోలుస్తూ కామెంట్లు పెడుతున్నారు. "బ్రెజిల్‌లో అయితే ల్యాప్‌టాప్‌తో పాటు కుర్చీ, టేబుల్ కూడా ఎత్తుకెళతారు" అని ఒక యూజర్ వ్యాఖ్యానించగా, "దక్షిణాఫ్రికాలో అయితే దాన్ని కింద పెట్టాల్సిన అవసరం కూడా లేదు, చేతుల్లోంచే లాక్కుపోతారు" అని మరొకరు రాశారు. మరోవైపు, కొలంబియాకు చెందిన ఓ వ్యక్తి తన అనుభవాన్ని పంచుకుంటూ, "నేను చైనాలోని ఓ రెస్టారెంట్‌లో 10,000 యువాన్లతో నా వాలెట్, ఫోన్ మర్చిపోయాను. 8 గంటల తర్వాత వెళితే అన్నీ అక్కడే ఉన్నాయి. అప్పటి నుంచి బీజింగ్ అంటే నాకు చాలా ఇష్టం" అని కామెంట్ చేశాడు. ఈ ప్రయోగం వివిధ దేశాల్లోని ప్రజా జీవితంలో భద్రత, నమ్మకంపై కొత్త చర్చను రేకెత్తించింది.
Go Back to Shorts
Tincho
China
social experiment
laptop
public safety
crime rate
social media influencer
trust
theft
Beijing

More Telugu News