CP Radhakrishnan: ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ విజయం

CP Radhakrishnan wins Vice President Election
షార్ట్స్‌లో చూడండి
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే కూటమి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ విజయం సాధించారు. మొత్తం 781 మంది సభ్యులకు గాను 767 మంది పార్లమెంటు సభ్యులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ శాతం 98.2గా నమోదైంది. సీపీ రాధాకృష్ణన్‌కు 452 మొదటి ప్రాధాన్యత ఓట్లు రాగా, ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డికి 300 ఓట్లు లభించాయి. 15 ఓట్లు చెల్లనివిగా రిటర్నింగ్ అధికారి పీసీ మోదీ వెల్లడించారు.

పార్లమెంటు నూతన భవనంలోని ఎఫ్-101 వసుధలో ఉదయం 10 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది. సాయంత్రం 6 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఉపరాష్ట్రపతి ఎన్నికలకు బీఆర్ఎస్, బీజేడీ, శిరోమణి అకాలీదళ్ సభ్యులు దూరంగా ఉన్నారు.

మొత్తమ్మీద 152 ఓట్ల మెజారిటీతో సీపీ రాధాకృష్ణన్ విజయం అందుకున్నారు. 
Go Back to Shorts
CP Radhakrishnan
Vice President Election
NDA candidate
Justice Sudarshan Reddy
Parliament Election

More Telugu News