Madhavaram Krishna Rao: అభివృద్ధి పనులు ప్రారంభిస్తూ.. ప్రభుత్వంపై కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం ఫైర్

Madhavaram Krishna Rao Fires at Government Over Development Delays
షార్ట్స్‌లో చూడండి
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి పనుల్లో జాప్యం నెలకొంటోందని కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అసంతృప్తి వ్యక్తం చేశారు. నిధులు మంజూరైనప్పటికీ పనులు ముందుకు సాగడం లేదని ఆయన విమర్శించారు. స్థానిక కార్పొరేటర్ నర్సింహ యాదవ్‌తో కలిసి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఓల్డ్ బోయిన్‌పల్లిలో పర్యటించారు. 

బోయిన్‌చెరువు కట్టమైసమ్మ ఆలయం నుంచి హస్మత్‌పేట డంప్‌ యార్డు వరకు కోటి రూపాయల అంచనా వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఈ రోడ్డు పూర్తయితే అంజయ్యనగర్ వాసుల ప్రయాణ కష్టాలు తీరుతాయని అన్నారు. బోయిన్‌చెరువును అత్యంత సుందరంగా తీర్చిదిద్దుతానని ప్రజలకు హామీ ఇచ్చారు.

అనంతరం శ్రీశ్రీనగర్‌లో రూ.20 లక్షలు, ఇందిరానగర్‌లో రూ.55 లక్షల వ్యయంతో చేపట్టనున్న తాగునీటి పైప్‌లైన్ పనులను కార్పొరేటర్ ఆవుల రవీందర్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమాల్లో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు జంగయ్య, వెంకట్‌రెడ్డితో పాటు శ్రీశ్రీనగర్, ఇందిరానగర్ వెల్ఫేర్ అసోసియేషన్ల అధ్యక్షులు దుర్గేష్, గిరిసాగర్, ఇతర సభ్యులు పాల్గొన్నారు. 
Go Back to Shorts
Madhavaram Krishna Rao
Kukatpally
Telangana
Congress Government
Development Works
Old Bowenpally
Drinking Water Pipeline
BRS
Narasimha Yadav
Avula Ravinder Reddy

More Telugu News