GST Council: జీఎస్టీ తగ్గింపుపై ఆశలు... లాభాల్లో దూసుకెళ్లిన స్టాక్ మార్కెట్ సూచీలు
జీఎస్టీ కౌన్సిల్ సమావేశంపై నెలకొన్న సానుకూల అంచనాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం భారీ లాభాలను నమోదు చేశాయి. జీఎస్టీ రేట్లను హేతుబద్ధీకరిస్తారనే అంచనాలతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపారు. దీంతో మార్కెట్లు రోజంతా ఉత్సాహంగా కదలాడాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 409.83 పాయింట్లు లాభపడి 80,567.71 వద్ద స్థిరపడింది. అదేవిధంగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 135.45 పాయింట్లు పెరిగి 24,715.05 వద్ద ముగిసింది.
బుధవారం ఉదయం సెన్సెక్స్ 80,295.99 పాయింట్ల వద్ద లాభాలతోనే ప్రారంభమైంది. రోజంతా కొనుగోళ్ల మద్దతుతో ఒక దశలో 80,671.28 పాయింట్ల గరిష్ఠ స్థాయిని కూడా తాకింది. జీఎస్టీ రేట్ల తగ్గింపు వినియోగాన్ని పెంచుతుందనే ఆశతో మెటల్, ఆటో, ఎఫ్ఎంసీజీ, బ్యాంకింగ్ రంగాల షేర్లలో కొనుగోళ్ల వెల్లువ కనిపించింది. విశ్లేషకుల అంచనా ప్రకారం, జీఎస్టీ సమావేశం ఫలితాలు మార్కెట్ తదుపరి గమనాన్ని నిర్దేశించనున్నాయి.
రంగాల వారీగా చూస్తే, నిఫ్టీ మెటల్ సూచీ ఏకంగా 3.11 శాతం పెరిగి టాప్ గెయినర్గా నిలిచింది. నిఫ్టీ బ్యాంక్ 0.76 శాతం, ఆటో 0.74 శాతం, ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.62 శాతం చొప్పున లాభపడ్డాయి. బ్రాడర్ మార్కెట్లలోనూ ఇదే జోరు కనిపించింది. మిడ్క్యాప్, స్మాల్క్యాప్ సూచీలు కూడా లాభాలతో ముగిశాయి.
ప్రధాన షేర్లలో టాటా స్టీల్, టైటాన్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఎస్బీఐ, ఐటీసీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టాటా మోటార్స్, ఏషియన్ పెయింట్స్ షేర్లు లాభపడగా.. ఇన్ఫోసిస్, హిందుస్థాన్ యూనిలీవర్, టీసీఎస్, ఎన్టీపీసీ, భారతీ ఎయిర్టెల్ షేర్లు నష్టపోయాయి.
ఇక డాలర్తో రూపాయి మారకం విలువ కూడా స్వల్పంగా బలపడింది. రూపాయి 0.13 పైసలు లాభపడి 88.02 వద్ద ట్రేడ్ అయింది.
బుధవారం ఉదయం సెన్సెక్స్ 80,295.99 పాయింట్ల వద్ద లాభాలతోనే ప్రారంభమైంది. రోజంతా కొనుగోళ్ల మద్దతుతో ఒక దశలో 80,671.28 పాయింట్ల గరిష్ఠ స్థాయిని కూడా తాకింది. జీఎస్టీ రేట్ల తగ్గింపు వినియోగాన్ని పెంచుతుందనే ఆశతో మెటల్, ఆటో, ఎఫ్ఎంసీజీ, బ్యాంకింగ్ రంగాల షేర్లలో కొనుగోళ్ల వెల్లువ కనిపించింది. విశ్లేషకుల అంచనా ప్రకారం, జీఎస్టీ సమావేశం ఫలితాలు మార్కెట్ తదుపరి గమనాన్ని నిర్దేశించనున్నాయి.
రంగాల వారీగా చూస్తే, నిఫ్టీ మెటల్ సూచీ ఏకంగా 3.11 శాతం పెరిగి టాప్ గెయినర్గా నిలిచింది. నిఫ్టీ బ్యాంక్ 0.76 శాతం, ఆటో 0.74 శాతం, ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.62 శాతం చొప్పున లాభపడ్డాయి. బ్రాడర్ మార్కెట్లలోనూ ఇదే జోరు కనిపించింది. మిడ్క్యాప్, స్మాల్క్యాప్ సూచీలు కూడా లాభాలతో ముగిశాయి.
ప్రధాన షేర్లలో టాటా స్టీల్, టైటాన్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఎస్బీఐ, ఐటీసీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టాటా మోటార్స్, ఏషియన్ పెయింట్స్ షేర్లు లాభపడగా.. ఇన్ఫోసిస్, హిందుస్థాన్ యూనిలీవర్, టీసీఎస్, ఎన్టీపీసీ, భారతీ ఎయిర్టెల్ షేర్లు నష్టపోయాయి.
ఇక డాలర్తో రూపాయి మారకం విలువ కూడా స్వల్పంగా బలపడింది. రూపాయి 0.13 పైసలు లాభపడి 88.02 వద్ద ట్రేడ్ అయింది.