Andhra Pradesh Government: రుషికొండ భవనాల వినియోగంపై ఏపీ ప్రభుత్వం దృష్టి

Andhra Pradesh Government Starts Review of Rushikonda Buildings Utilization
షార్ట్స్‌లో చూడండి
రుషికొండలో గత ప్రభుత్వం నిర్మించిన భవనాలను ఏ విధంగా వినియోగించాలనే అంశంపై ఆంధ్రప్రదేశ్‌ కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. భవనాల వినియోగంపై సమగ్ర అధ్యయనం చేసేందుకు ముగ్గురు మంత్రులతో కూడిన కమిటీని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ ఈ మేరకు ఉత్తర్వులు విడుదల చేశారు.

పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. ప్రస్తుతం ఖాళీగా ఉన్న భవనాలను సముచితంగా వినియోగించే మార్గాలను అన్వేషించి, తగిన సిఫార్సులు ప్రభుత్వానికి అందజేయాలని కమిటీకి సూచించారు.
Go Back to Shorts
Andhra Pradesh Government
Rushikonda buildings
Andhra Pradesh tourism
Kandula Durgesh

More Telugu News