వరద బాధితుల కష్టాలు తెలుసుకునేందుకు బయల్దేరిన కేటీఆర్.. బీఆర్ఎస్ శ్రేణులకు కీలక ఆదేశాలు

రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా తీవ్రంగా ప్రభావితమైన సిరిసిల్ల, కామారెడ్డి జిల్లాల్లో పర్యటించేందుకు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ బయలుదేరారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన క్షేత్రస్థాయిలో వరద నష్టాన్ని పరిశీలించి, బాధితుల సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు.

పర్యటనకు బయలుదేరడానికి ముందు కేటీఆర్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బీఆర్‌ఎస్‌ నాయకులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వరదల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఈ క్లిష్ట సమయంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు బాధితులకు అండగా నిలవాలని ఆయన ఆదేశించారు. తక్షణమే సహాయక చర్యలు చేపట్టి, అవసరమైన సేవలు అందించాలని దిశానిర్దేశం చేశారు.

కేటీఆర్‌ తన పర్యటనను మొదట సిరిసిల్ల జిల్లాలోని నర్మాల గ్రామం నుంచి ప్రారంభించనున్నారు. అక్కడి పరిస్థితులను సమీక్షించిన అనంతరం ఆయన కామారెడ్డి జిల్లాలో పర్యటిస్తారు. భారీ వర్షాల వల్ల కలిగిన పంట నష్టం, ఆస్తి నష్టం వివరాలను స్థానిక నాయకులు, అధికారులను అడిగి తెలుసుకుంటారు. కేటీఆర్ పర్యటన నేపథ్యంలో ఆయా జిల్లాల బీఆర్‌ఎస్‌ నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు.

KTR
KTR tour
Telangana floods
BRS party
Sircilla floods
Kamareddy floods
Telangana rains
Flood relief
Telangana news
KTR instructions

More Telugu News