Bandi Sanjay: 'రాముడు లేడు, రామాయణం లేదు' అంటూ సుప్రీం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది కాంగ్రెస్ పార్టీనే: బండి సంజయ్

Bandi Sanjay criticizes Congress over disrespect towards Lord Rama
షార్ట్స్‌లో చూడండి
కాంగ్రెస్ పార్టీకి శ్రీరాముడి పట్ల ఏమాత్రం గౌరవం లేదని, ఆ పార్టీ మొదటి నుంచి రాముడిని అవమానిస్తూనే వస్తోందని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ విమర్శలు గుప్పించారు. రాముడి విషయంలో కాంగ్రెస్ ఎప్పుడూ ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని ఆయన ఆరోపించారు.

గతంలో రామ సేతు వివాదంలో 'రాముడు లేడు, రామాయణం లేదు' అంటూ సుప్రీం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిందే కాంగ్రెస్ పార్టీ అని ఆయన గుర్తు చేశారు. దశాబ్దాల పాటు అయోధ్యలోని రామ మందిరం తలుపులు తెరుచుకోకుండా అడ్డుపడిందని ఆరోపించారు. అంతేకాకుండా, రాహుల్ గాంధీ గతంలో 'రామ మందిర ఉద్యమం విఫలమైంది' అని వ్యాఖ్యానించారని, ఇటీవల జరిగిన ప్రాణ ప్రతిష్ఠ వేడుకను సైతం కాంగ్రెస్ బహిష్కరించిందని మండిపడ్డారు. హిందువులను 'హింసాత్మకులు'గా అభివర్ణించింది కూడా కాంగ్రెస్ పార్టీయేనని ఆయన అన్నారు.

రాముడి పేరును స్మరిస్తున్న బీజేపీని ఎగతాళి చేయడం వారి వైఖరికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. "కాంగ్రెస్‌కు రాముడిని అవమానించడం ఒక అలవాటుగా మారింది. కానీ మాకు రాముడు అంటే ప్రాణం, విశ్వాసం. శ్రీరాముడు మాకు రాజకీయ అంశం కాదు, ఈ దేశపు గుండె చప్పుడు" అని బండి సంజయ్ స్పష్టం చేశారు.

అయోధ్యలో రామ మందిర నిర్మాణం, ప్రాణ ప్రతిష్ఠ వంటి చారిత్రక ఘట్టాల్లో కాంగ్రెస్ వ్యవహరించిన తీరును ప్రజలు ఎప్పటికీ మరిచిపోరని ఆయన తెలిపారు. తాము రాముడి భక్తిని ఎన్నటికీ రాజకీయాలకు వాడుకోమని చెప్పారు. 
Go Back to Shorts
Bandi Sanjay
Congress party
Rama Setu
Ram Mandir
Ayodhya
Rahul Gandhi
Hinduism
BJP
Ram Temple inauguration
Ramayana

More Telugu News