ర్యాపిడో డ్రైవర్లుగా మహిళలు... నారా లోకేశ్ స్పందన
- ర్యాపిడోతో భాగస్వామ్యం ద్వారా వెయ్యి మంది మహిళలకు ఉపాధి
- రవాణా అంటే ప్రయాణమే కాదు.. అవకాశం, గౌరవం అని లోకేశ్ వ్యాఖ్య
- ఈవీ వాహనాల కొనుగోలుకు మహిళలకు ప్రభుత్వ రాయితీ ఇస్తోందని వెల్లడి
ప్రముఖ రవాణా సేవల సంస్థ ర్యాపిడోతో కుదిరిన భాగస్వామ్యం ద్వారా వెయ్యి మందికి పైగా మహిళలు డ్రైవర్లుగా ఉపాధి పొందడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. మహిళలు ర్యాపిడో వాహనాలు నడుపుతున్న వీడియోను సోమవారం తన ‘ఎక్స్’ ఖాతాలో పంచుకున్నారు. మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు.
అంతేకాకుండా, మహిళలు ఎలక్ట్రిక్ వాహనాలు (ఈవీ) కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా రాయితీలు కల్పిస్తున్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. రవాణా ప్రణాళిక అంటే కేవలం ఓ చోటు నుంచి మరో చోటుకు ప్రయాణించడం మాత్రమే కాదని, అది మహిళలకు లభించే అవకాశం, గౌరవం అని లోకేశ్ అభిప్రాయపడ్డారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా తమది కచ్చితంగా మంచి ప్రభుత్వమని రుజువు చేసుకుంటున్నామని ఆయన వివరించారు.