రైలులో మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన కానిస్టేబుల్.. వీడియో ఇదిగో!
- నిద్రిస్తున్న మహిళను అసభ్యంగా తాకిన వైనం
- చీకట్లో ఎవరూ గుర్తించలేరనే ధైర్యంతో నిర్వాకం
- చేతిని పట్టేసుకుని నిలదీసిన మహిళ.. దండం పెడుతూ కానిస్టేబుల్ వేడుకోలు
వివరాల్లోకి వెళితే.. ఢిల్లీ నుంచి ప్రయాగ్ రాజ్ వెళ్తున్న ట్రెయిన్లో మహిళల భద్రతను కాపాడాల్సిన జీఆర్పీ కానిస్టేబుల్ ఆశిష్ గుప్తా దారుణంగా ప్రవర్తించాడు. రాత్రివేళలో లైట్లు ఆఫ్ చేసి ఉండటాన్ని అవకాశంగా తీసుకున్న అతను, నిద్రలో ఉన్న ఓ మహిళను అసభ్యకరంగా తాకేందుకు ప్రయత్నించాడు. యువతి నిద్రలేచి పట్టుకోవడంతో క్షమించాలని వేడుకున్నాడు. మహిళ ఫిర్యాదుతో ఉన్నతాధికారులు స్పందించి ఆశిష్ గుప్తాను సస్పెండ్ చేశారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.