Medaram Jatara: మేడారం మహా జాతరకు భారీగా నిధులు.. రూ. 150 కోట్లు మంజూరు చేసిన సర్కార్

Medaram Jatara Receives Huge Funds of 150 Crores From Telangana Government
షార్ట్స్‌లో చూడండి
తెలంగాణలో జరిగే అతిపెద్ద గిరిజన జాతర అయిన సమ్మక్క సారలమ్మ మహా జాతర నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసింది. జాతరకు ఐదు నెలల ముందే భారీగా నిధులు విడుదల చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. 2026లో జరగనున్న మేడారం జాతర ఏర్పాట్ల కోసం రూ. 150 కోట్లను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది.

ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారంలో వచ్చే ఏడాది జనవరి 28 నుంచి 31వ తేదీ వరకు ఈ మహా జాతర జరగనుంది. ఈ జాతరకు సుమారు కోటిన్నర మందికి పైగా భక్తులు హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేసేందుకు ప్రభుత్వం ఇప్పటి నుంచే చర్యలు ప్రారంభించింది.

గతంలో 2024 జాతర కోసం కేటాయించిన నిధుల కంటే ఈసారి అదనంగా రూ. 45 కోట్లు పెంచడం విశేషం. అంతేకాకుండా, సాధారణంగా జాతరకు కొన్ని రోజుల ముందు నిధులు విడుదల చేసే పద్ధతికి భిన్నంగా, ఈసారి ఐదు నెలల ముందుగానే నిధులను విడుదల చేయడంపై భక్తులు, స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ ముందస్తు చర్యల వల్ల అభివృద్ధి పనులు నాణ్యతతో, సకాలంలో పూర్తవుతాయని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

నిధుల విడుదలపై మంత్రి సీతక్క స్పందిస్తూ జాతరకు భారీగా నిధులు కేటాయించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం జాతర ప్రాముఖ్యతకు, భక్తుల మనోభావాలకు ఇస్తున్న గౌరవానికి నిదర్శనమని పలువురు అభిప్రాయపడుతున్నారు.
Go Back to Shorts
Medaram Jatara
Sammakka Saralamma Jatara
Telangana
Tribal Festival
Mulugu District
Revanth Reddy
Funds release
Giriian Jatara

More Telugu News