Infosys: ఉద్యోగులకు ఇన్ఫోసిస్ గుడ్‌న్యూస్.. వారికి 80 శాతం బోనస్

Infosys Announces 80 Percent Bonus for Employees
  • ఇన్ఫోసిస్ ఉద్యోగులకు పనితీరు బోనస్ ప్రకటన
  • సగటున 80 శాతం బోనస్ చెల్లించనున్న సంస్థ
  • జూనియర్, మిడ్ లెవల్ ఉద్యోగులకు వర్తింపు
  • క్యూ1లో అంచనాలను మించిన ఆదాయం, లాభాలు
  • గత త్రైమాసికం కంటే గణనీయంగా పెరిగిన బోనస్ శాతం
  • జనవరి నుంచి 6-8 శాతం జీతాల పెంపు కూడా అమలు
ప్రముఖ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ తన ఉద్యోగులకు శుభవార్తను అందించింది. 2025-26 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికి (ఏప్రిల్-జూన్ 2025) గాను పనితీరు ఆధారిత బోనస్‌ను ప్రకటించింది. ఈసారి సగటున 80 శాతం బోనస్‌ను చెల్లించనున్నట్లు కంపెనీ తన ఉద్యోగులకు పంపిన అంతర్గత సమాచారంలో వెల్లడించింది.

జూన్ త్రైమాసికంలో కంపెనీ అంచనాలను మించి అద్భుతమైన ఆర్థిక ఫలితాలు సాధించిన నేపథ్యంలో ఈ బోనస్ నిర్ణయం తీసుకుంది. ఈ బోనస్ ప్రధానంగా బ్యాండ్ 6, ఆ కింది స్థాయి ఉద్యోగులకు, అంటే జూనియర్, మిడ్-లెవల్ సిబ్బందికి వర్తిస్తుంది. ఉద్యోగుల పనితీరు రేటింగ్‌ను బట్టి బోనస్ శాతంలో మార్పులు ఉంటాయి. పీఎల్6 స్థాయిలో అత్యుత్తమ పనితీరు కనబరిచిన వారికి 85 శాతం బోనస్ లభించనుండగా, అత్యల్పంగా 75 శాతం అందుతుంది. అదేవిధంగా పీఎల్4 స్థాయి ఉద్యోగులకు 80 నుంచి 89 శాతం మధ్య బోనస్ చెల్లిస్తారు.

గత త్రైమాసికంలో అర్హులైన సిబ్బందికి సగటున 65 శాతం బోనస్ మాత్రమే చెల్లించగా, ఈసారి దానిని 80 శాతానికి పెంచడం గమనార్హం. జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో ఇన్ఫోసిస్ నికర లాభం వార్షిక ప్రాతిపదికన 8.7 శాతం పెరిగి రూ. 6,921 కోట్లకు చేరింది. అదే సమయంలో, ఆదాయం 7.5 శాతం వృద్ధితో రూ. 42,279 కోట్లుగా నమోదైంది.
Infosys
Infosys bonus
Infosys employees
IT sector
Q1 bonus
Financial year 2025-26

More Telugu News