Nara Lokesh: ఈ రాత్రికి ఢిల్లీ వెళుతున్న మంత్రి నారా లోకేశ్... రేపు కేంద్రమంత్రులతో వరుస భేటీలు

Nara Lokesh to Visit Delhi Tonight for Meetings with Central Ministers
షార్ట్స్‌లో చూడండి
రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక ప్రాజెక్టులపై చర్చించేందుకు ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. ఈరోజు రాత్రి ఆయన హస్తినకు బయలుదేరనుండగా, సోమవారం నాడు ఆరుగురు కీలక కేంద్ర మంత్రులతో వేర్వేరుగా సమావేశం కానున్నారు. రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న పనులకు మోక్షం కల్పించడం, కొత్త ప్రతిపాదనలు అందజేయడమే లక్ష్యంగా ఈ పర్యటన జరగనుంది.

వివరాల్లోకి వెళితే, సోమవారం జరగనున్న ఈ భేటీల్లో భాగంగా కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్, విదేశాంగ మంత్రి జైశంకర్‌లతో లోకేశ్ సమావేశమవుతారు. అదేవిధంగా, పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి, ఓడరేవులు, జలరవాణా శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్‌లతో కూడా ఆయన భేటీ అయి రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున వివిధ ప్రాజెక్టులకు సంబంధించిన ప్రతిపాదనలను వారికి అందజేయనున్నారు.

ఈ పర్యటనలో భాగంగా, ఇటీవల రాష్ట్రానికి సెమీకండక్టర్ తయారీ యూనిట్‌ను మంజూరు చేసినందుకు కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, రైల్వే శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్‌ను కలిసి లోకేశ్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అభివృద్ధి పనులను వేగవంతం చేసే దిశగా మంత్రి లోకేశ్ కేంద్ర ప్రభుత్వంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్న విషయం తెలిసిందే.
Go Back to Shorts
Nara Lokesh
Andhra Pradesh
Central Ministers
Nitin Gadkari
Piyush Goyal
Jaishankar
Hardip Singh Puri
Sarbananda Sonowal
Ashwini Vaishnaw
AP Projects

More Telugu News