: తెలంగాణలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు

––
తెలంగాణలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలోని తొమ్మిది జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అల్పపీడన ప్రభావంతో ఈ రోజు భూపాలపల్లి, సంగారెడ్డి, కామారెడ్డి, నిర్మల్‌, నిజామాబాద్‌, ములుగు, భద్రాద్రి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, మహబూబాబాద్‌, వరంగల్‌, హనుమకొండ, వికారాబాద్‌, మెదక్‌ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

ఆదిలాబాద్ జిల్లాల్లో భారీ వాన..
ఆదిలాబాద్‌, నిజామాబాద్‌ జిల్లాల్లోని పలు మండలాల్లో ఈ రోజు తెల్లవారుజాము నుంచి భారీ వర్షం పడుతోంది. వాగులు, వంకలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో పలు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. నిర్మల్‌ జిల్లా కడెం జలాశయానికి, భైంసా గడ్డెన్న వాగు ప్రాజెక్టుకు భారీగా వరద వచ్చి చేరుతోంది. ప్రాజెక్టుకు ఇన్ ఫ్లో 6,484 క్యూసెక్కులు కాగా అధికారులు రెండు గేట్లు ఎత్తి 4,571 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

More Telugu News