Veeraiah Choudary: వీరయ్య చౌదరి హత్య కేసు.. నిందితుడి ముందస్తు బెయిల్ కు సుప్రీం తిరస్కరణ

Veeraiah Choudary Murder Case Supreme Court Denies Anticipatory Bail
––
ఒంగోలు తెలుగుదేశం పార్టీ నేత వీరయ్య చౌదరి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు సురేశ్ బాబుకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ముందస్తు బెయిల్ కోసం ఆయన పెట్టుకున్న పిటిషన్ ను కోర్టు తోసిపుచ్చింది. సురేశ్ బాబు దాఖలు చేసిన పిటిషన్ ను జస్టిస్‌ రాజేశ్‌ బిందాల్‌, జస్టిస్‌ మన్మోహన్‌ ల ధర్మాసనం ఈ రోజు ఉదయం విచారించింది. వీరయ్య చౌదరి హత్య కేసులో ఇప్పటికే 9 మందిని అరెస్టు చేశామని, ప్రధాన నిందితుడు సురేశ్‌ బాబు పరారీలో ఉన్నాడని పోలీసులు వెల్లడించారు.

ఈ కేసులో సురేశ్ బాబు ప్రమేయానికి సంబంధించి స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని ధర్మాసనం పేర్కొంది. డబ్బులు చేతులు మారడం, ఫోన్ కాల్స్‌ వంటి కీలకమైన ఆధారాలు ఉన్న నేపథ్యంలో ముందస్తు బెయిల్‌ కు సురేశ్ బాబుకు అర్హతలేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అయితే, ఈ కేసులో మిగతా నిందితులకు రెగ్యులర్ బెయిల్ మంజూరైన విషయాన్ని సురేశ్ బాబు తరఫు న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ఈ ముందస్తు బెయిల్ విషయంలోనూ కింది కోర్టునే ఆశ్రయించాలని సుప్రీం ధర్మాసనం సూచించింది.
Veeraiah Choudary
Veeraiah Choudary murder case
Suresh Babu
Supreme Court
Anticipatory bail
TDP Leader
Andhra Pradesh Crime
Justice Rajesh Bindal
Justice Manmohan

More Telugu News