రేవంత్ రెడ్డితో విభేదాలు ఉన్నాయనే వార్తలపై మహేశ్ కుమార్ గౌడ్ స్పందన
- అవన్నీ తప్పుడు వార్తలన్న పీసీసీ చీఫ్
- రేవంత్ తో మంచి అనుబంధం ఉందని వ్యాఖ్య
- బీసీ వ్యక్తి తెలంగాణ సీఎం కావడం ఖాయమని ధీమా
బీజేపీ నేతలు బండి సంజయ్, ధర్మపురి అర్వింద్, ఈటల రాజేందర్ ల మౌనం బీసీలకు అన్యాయం చేస్తుందని అన్నారు. 42 శాతం బీసీ రిజర్వేషన్లకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. బీసీ సామాజికవర్గానికి చెందిన వ్యక్తి తెలంగాణ ముఖ్యమంత్రి కావడం ఖాయమని జోస్యం చెప్పారు.