రోజాపై మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేసిన గాలి భాను ప్రకాశ్
- రోజా, ఆమె కుటుంబ సభ్యులు భారీ అవినీతికి పాల్పడ్డారన్న భాను
- బియ్యం, ఇసుక అక్రమ రవాణా చేశారని ఆరోపణ
- గంజాయి దందాలో కూడా వారి పాత్ర ఉందన్న భాను
గత కొంత కాలంగా గాలి భాను ప్రకాశ్, రోజా మధ్య మాటల తూటాలు పేలుతున్న సంగతి తెలిసిందే. రోజాను ఉద్దేశించి ఇటీవల భాను మాట్లాడుతూ... రూ. 2 వేలు ఇస్తే రోజా ఏ పనైనా చేసేదని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రోజా వ్యాంప్ కు ఎక్కువ, హీరోయిన్ కు తక్కువ అని విమర్శించారు. ఈ వ్యాఖ్యలపై రోజా జాతీయ, రాష్ట్ర మహిళా కమిషన్ లకు ఫిర్యాదు చేశారు. మహిళలను కించపరిచే సంస్కృతిని టీడీపీ ప్రోత్సహిస్తోందని ఆమె మండిపడ్డారు.