AP Police: ఏపీ పోలీస్ కానిస్టేబుల్ తుది ఫలితాల విడుదల
- ఫలితాలను విడుదల చేసిన హోం మంత్రి అనిత, ఏపీ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా
- ఏపీ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఫలితాలు
- ఈ రిక్రూట్మెంట్లో భాగంగా 6,100 కానిస్టేబుల్ పోస్టుల భర్తీ
ఏపీలో పోలీసు కానిస్టేబుల్ నియామకాల తుది ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర హోం మంత్రి అనిత, ఏపీ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా ఈ రోజు ఉదయం మంగళగిరిలోని డీజీపీ కార్యాలయంలో ఫలితాలను విడుదల చేశారు. ఏపీ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అధికారిక వెబ్సైట్ https://slprb.ap.gov.in/లో ఫలితాలను అందుబాటులో ఉంచినట్టు తెలిపారు.
ఇక, ఈ ఫలితాల్లో గండి నానాజి 168 మార్కులతో ప్రథమ స్థానంలో నిలిచినట్లు అధికారులు ప్రకటించారు. అలాగే జి.రమ్య మాధురి 159 మార్కులతో రెండో స్థానం, మెరుగు అచ్యుతారావు 144.5 మార్కులతో మూడో స్థానంలో నిలిచారు. ఈ రిక్రూట్మెంట్ ద్వారా 6,100 కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
ఇక, ఈ ఫలితాల్లో గండి నానాజి 168 మార్కులతో ప్రథమ స్థానంలో నిలిచినట్లు అధికారులు ప్రకటించారు. అలాగే జి.రమ్య మాధురి 159 మార్కులతో రెండో స్థానం, మెరుగు అచ్యుతారావు 144.5 మార్కులతో మూడో స్థానంలో నిలిచారు. ఈ రిక్రూట్మెంట్ ద్వారా 6,100 కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనున్నారు.