రాజస్థాన్‌ను ముంచెత్తుతున్న భారీ వ‌ర్షాలు.. రైలు పట్టాలపై భారీగా వ‌ర‌ద నీరు

     
రాజస్థాన్‌ను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. వర్షాల కారణంగా వ‌ర‌ద‌లు పోటెతుత్తుండ‌టంతో లోత‌ట్టు ప్రాంతాలు జ‌లాశ‌యాల‌ను త‌ల‌పిస్తున్నాయి. తాజాగా సవాయి మాధోపూర్‌ రైల్వేస్టేషన్‌లో పట్టాలపై భారీగా వరద చేరింది. దీంతో రైళ్ల రాకపోకలకు తీవ్ర‌ అంతరాయం ఏర్ప‌డింది. 

వెంట‌నే రంగంలోకి దిగిన భద్రతా సిబ్బంది ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందుజాగ్రత్త చర్యలు చేపట్టింది. ఇక‌, వర్షాల కారణంగా టోంక్‌ కోర్టు ప్రాంగణంతో పాటు రహదారులు నీటమునిగి చెరువులను తలపిస్తున్నాయి. 



More Telugu News