Nadendla Manohar: విజయవాడ, గన్నవరంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టిన మంత్రి నాదెండ్ల మనోహర్
- పౌర సరఫరాల వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం లక్ష్యంగా తనిఖీలు
- బియ్యం బస్తాల ప్యాకింగ్ ల పరిశీలన
- తన ఫోన్ తో స్కాన్ చేసి వివరాలు తెలుసుకున్న నాదెండ్ల
ఆంధ్రప్రదేశ్ వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఈరోజు విజయవాడలోని గొల్లపూడి అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ ప్రాంగణంలోని సివిల్ సప్లై గోడౌన్ను, అలాగే గన్నవరం సివిల్ సప్లై గోడౌన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పౌర సరఫరాల వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం తీసుకురావడమే లక్ష్యంగా ఈ తనిఖీలు జరిగాయి.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఈ విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రవ్యాప్తంగా 41,091 పాఠశాలలు మరియు 3,800 సంక్షేమ హాస్టళ్లకు మధ్యాహ్న భోజన పథకం కింద 25 కిలోల బస్తాల్లో బియ్యం పంపిణీ జరుగుతోందని తెలిపారు. ఈ పథకాన్ని మరింత మెరుగుపరచడానికి ప్రతి బియ్యం బస్తాపై క్యూఆర్ కోడ్ ముద్రించడం జరుగుతోందని, దీనికి చిన్నారులు, తల్లిదండ్రుల నుంచి మంచి స్పందన వస్తోందని ఆయన అన్నారు.
విజయవాడ ఎం.ఎల్.ఎస్. పాయింట్ నుంచి ఇబ్రహీంపట్నం, విజయవాడ అర్బన్, విజయవాడ రూరల్ పరిధిలోని 378 చౌక ధరల దుకాణాలకు బియ్యం సరఫరా అవుతోంది. గన్నవరం రైస్ గోడౌన్ నుంచి గన్నవరం, బాపులపాడు, ఉంగుటూరు మండలాల్లోని 103 చౌక ధరల దుకాణాలకు సరఫరా జరుగుతోంది. ఈ నేపథ్యంలో, మంత్రి గోడౌన్లోని మధ్యాహ్న భోజనానికి అందించే బియ్యం బస్తాల ప్యాకింగ్లను నిశితంగా పరిశీలించారు. బియ్యం బస్తాపై ఉన్న క్యూఆర్ కోడ్ను తన ఫోన్ ద్వారా స్వయంగా స్కాన్ చేసి, వివరాలు సరిగ్గా వస్తున్నాయో లేదో తనిఖీ చేశారు. బఫర్ గోడౌన్ నుంచి వచ్చిన స్టాక్ను దిగుమతి చేసుకున్న తర్వాత, మండల్ లెవెల్ స్టాక్ పాయింట్ నుంచి డీలర్లకు ఎగుమతి చేసేటప్పుడు ప్యాకింగ్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని హమాలీ కూలీలను అడిగి తెలుసుకున్నారు.
బియ్యం బస్తా ప్యాకింగ్, బియ్యం నాణ్యత, గోడౌన్ పరిసరాల పరిశుభ్రత విషయంలో ఎటువంటి రాజీ పడకూడదని, ఇందులో ఏమైనా పొరపాట్లు జరిగితే కఠిన చర్యలు తప్పవని అధికారులను మంత్రి హెచ్చరించారు. తూకం, ఆయిల్ ప్యాకెట్లను కూడా ఆయన స్వయంగా తనిఖీ చేశారు. గత మూడు నెలల స్టాక్ రిజిస్టర్లను పరిశీలించగా, కొంత మంది డీలర్ల వద్ద క్లోజింగ్, ఓపెనింగ్ స్టాక్లో గణనీయమైన వ్యత్యాసం ఉన్నట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో, విజయవాడ రైస్ గోడౌన్ నుంచి బియ్యం తీసుకుంటున్న నాలుగు డీలర్ల స్టాక్ వెరిఫికేషన్లో వ్యత్యాసం ఉన్నట్లు కనుగొన్నారు.
ఈ అక్రమాల నేపథ్యంలో, మంత్రి ఏలూరు రోడ్డులోని పోతినేని వారి వీధిలో ఉన్న ఒక చౌక ధరల దుకాణాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ దుకాణం వద్ద డీలర్ లేకపోవడం, ఉండవలసిన స్టాక్ లేకపోవడం, దుకాణం బయట విధిగా ఏర్పాటు చేయవలసిన పోస్టర్ లేకపోవడంపై మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి చౌక ధరల దుకాణం వద్ద విధిగా స్టాక్, అధికారుల వివరాలు, అభిప్రాయం మరియు ఫిర్యాదులు చేయడానికి క్యూఆర్ కోడ్ స్కానర్తో కూడిన పోస్టర్ను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
ప్రతి నెలా ఒకటో తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ప్రజలకు రేషన్ బియ్యాన్ని అందిస్తున్నామని మంత్రి తెలిపారు. సంస్కరణలలో భాగంగా దివ్యాంగులకు, 65 సంవత్సరాలు పైబడిన వృద్ధులకు ప్రతి నెలా 5 రోజులు ముందుగా (25వ తేదీ నుంచి 30వ తేదీ లోపు) వారి ఇంటి వద్దకు వెళ్లి రేషన్ సరుకులు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలను దృష్టిలో ఉంచుకుని, కూటమి ప్రభుత్వం కఠినమైన తనిఖీలతో నిబంధనలను పటిష్టంగా అమలు చేస్తోందని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. పౌర సరఫరాల వ్యవస్థలో పూర్తి పారదర్శకత మరియు జవాబుదారీతనం తీసుకురావడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన పునరుద్ఘాటించారు.







ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఈ విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రవ్యాప్తంగా 41,091 పాఠశాలలు మరియు 3,800 సంక్షేమ హాస్టళ్లకు మధ్యాహ్న భోజన పథకం కింద 25 కిలోల బస్తాల్లో బియ్యం పంపిణీ జరుగుతోందని తెలిపారు. ఈ పథకాన్ని మరింత మెరుగుపరచడానికి ప్రతి బియ్యం బస్తాపై క్యూఆర్ కోడ్ ముద్రించడం జరుగుతోందని, దీనికి చిన్నారులు, తల్లిదండ్రుల నుంచి మంచి స్పందన వస్తోందని ఆయన అన్నారు.
విజయవాడ ఎం.ఎల్.ఎస్. పాయింట్ నుంచి ఇబ్రహీంపట్నం, విజయవాడ అర్బన్, విజయవాడ రూరల్ పరిధిలోని 378 చౌక ధరల దుకాణాలకు బియ్యం సరఫరా అవుతోంది. గన్నవరం రైస్ గోడౌన్ నుంచి గన్నవరం, బాపులపాడు, ఉంగుటూరు మండలాల్లోని 103 చౌక ధరల దుకాణాలకు సరఫరా జరుగుతోంది. ఈ నేపథ్యంలో, మంత్రి గోడౌన్లోని మధ్యాహ్న భోజనానికి అందించే బియ్యం బస్తాల ప్యాకింగ్లను నిశితంగా పరిశీలించారు. బియ్యం బస్తాపై ఉన్న క్యూఆర్ కోడ్ను తన ఫోన్ ద్వారా స్వయంగా స్కాన్ చేసి, వివరాలు సరిగ్గా వస్తున్నాయో లేదో తనిఖీ చేశారు. బఫర్ గోడౌన్ నుంచి వచ్చిన స్టాక్ను దిగుమతి చేసుకున్న తర్వాత, మండల్ లెవెల్ స్టాక్ పాయింట్ నుంచి డీలర్లకు ఎగుమతి చేసేటప్పుడు ప్యాకింగ్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని హమాలీ కూలీలను అడిగి తెలుసుకున్నారు.
బియ్యం బస్తా ప్యాకింగ్, బియ్యం నాణ్యత, గోడౌన్ పరిసరాల పరిశుభ్రత విషయంలో ఎటువంటి రాజీ పడకూడదని, ఇందులో ఏమైనా పొరపాట్లు జరిగితే కఠిన చర్యలు తప్పవని అధికారులను మంత్రి హెచ్చరించారు. తూకం, ఆయిల్ ప్యాకెట్లను కూడా ఆయన స్వయంగా తనిఖీ చేశారు. గత మూడు నెలల స్టాక్ రిజిస్టర్లను పరిశీలించగా, కొంత మంది డీలర్ల వద్ద క్లోజింగ్, ఓపెనింగ్ స్టాక్లో గణనీయమైన వ్యత్యాసం ఉన్నట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో, విజయవాడ రైస్ గోడౌన్ నుంచి బియ్యం తీసుకుంటున్న నాలుగు డీలర్ల స్టాక్ వెరిఫికేషన్లో వ్యత్యాసం ఉన్నట్లు కనుగొన్నారు.
ఈ అక్రమాల నేపథ్యంలో, మంత్రి ఏలూరు రోడ్డులోని పోతినేని వారి వీధిలో ఉన్న ఒక చౌక ధరల దుకాణాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ దుకాణం వద్ద డీలర్ లేకపోవడం, ఉండవలసిన స్టాక్ లేకపోవడం, దుకాణం బయట విధిగా ఏర్పాటు చేయవలసిన పోస్టర్ లేకపోవడంపై మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి చౌక ధరల దుకాణం వద్ద విధిగా స్టాక్, అధికారుల వివరాలు, అభిప్రాయం మరియు ఫిర్యాదులు చేయడానికి క్యూఆర్ కోడ్ స్కానర్తో కూడిన పోస్టర్ను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
ప్రతి నెలా ఒకటో తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ప్రజలకు రేషన్ బియ్యాన్ని అందిస్తున్నామని మంత్రి తెలిపారు. సంస్కరణలలో భాగంగా దివ్యాంగులకు, 65 సంవత్సరాలు పైబడిన వృద్ధులకు ప్రతి నెలా 5 రోజులు ముందుగా (25వ తేదీ నుంచి 30వ తేదీ లోపు) వారి ఇంటి వద్దకు వెళ్లి రేషన్ సరుకులు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలను దృష్టిలో ఉంచుకుని, కూటమి ప్రభుత్వం కఠినమైన తనిఖీలతో నిబంధనలను పటిష్టంగా అమలు చేస్తోందని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. పౌర సరఫరాల వ్యవస్థలో పూర్తి పారదర్శకత మరియు జవాబుదారీతనం తీసుకురావడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన పునరుద్ఘాటించారు.






