భారత ఎయిర్లైన్స్పై నిషేధాన్ని పొడిగించిన పాకిస్థాన్
- ఆగస్టు 24 వరకు భారత ఎయిర్లైన్స్పై బ్యాన్ పొడిగింపు
- ఈ మేరకు పాకిస్థాన్ ఎయిర్పోర్ట్ అథారిటీ తాజాగా ప్రకటన
- ఈ నిషేధం భారత సైనిక, పౌర విమానాలన్నింటికీ వర్తిస్తుందని వెల్లడి
పాకిస్థాన్ తన గగనతలాన్ని ఉపయోగించి భారత్ నడిపే విమానాలపై నిషేధాన్ని పొడిగించింది. ఆగస్టు 24 వరకు భారత ఎయిర్లైన్స్పై బ్యాన్ను పొడిగించినట్లు పాకిస్థాన్ ఎయిర్పోర్ట్ అథారిటీ (పీఏఏ) తాజాగా ప్రకటించింది. ఈ నిషేధం భారత సైనిక, పౌర విమానాలన్నింటికీ వర్తిస్తుందని తెలిపింది.
శుక్రవారం జారీ చేసిన నోటామ్ (ఎయిర్మెన్కు నోటీసు) మధ్యాహ్నం 3:50 గంటలకు అమల్లోకి వచ్చింది. ఈ కొత్త నిషేధం ఆగస్టు 24 ఉదయం 5:19 గంటల వరకు అమలులో ఉంటుంది.
కొనసాగుతున్న పరస్పర గగనతల ఆంక్షలు
అటు ఈ నెల 24 వరకు పాకిస్థాన్ విమానాలకు భారత్ తన గగనతలాన్ని మూసివేసింది. ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రవాద దాడిలో 26 మంది మరణించిన నేపథ్యంలో ఇండియా మొదట ఏప్రిల్ 30న ఈ ఆంక్షలను విధించింది. ఆ తర్వాత ఈ బ్యాన్ను జులై 24 వరకు పొడిగించింది. ఈ గడువును ఇప్పుడు మళ్లీ పొడిగించే అవకాశం ఉంది.
శుక్రవారం జారీ చేసిన నోటామ్ (ఎయిర్మెన్కు నోటీసు) మధ్యాహ్నం 3:50 గంటలకు అమల్లోకి వచ్చింది. ఈ కొత్త నిషేధం ఆగస్టు 24 ఉదయం 5:19 గంటల వరకు అమలులో ఉంటుంది.
కొనసాగుతున్న పరస్పర గగనతల ఆంక్షలు
అటు ఈ నెల 24 వరకు పాకిస్థాన్ విమానాలకు భారత్ తన గగనతలాన్ని మూసివేసింది. ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రవాద దాడిలో 26 మంది మరణించిన నేపథ్యంలో ఇండియా మొదట ఏప్రిల్ 30న ఈ ఆంక్షలను విధించింది. ఆ తర్వాత ఈ బ్యాన్ను జులై 24 వరకు పొడిగించింది. ఈ గడువును ఇప్పుడు మళ్లీ పొడిగించే అవకాశం ఉంది.