Prasanna Kumar Reddy: మహిళా ఎమ్మెల్యేపై ఇలాంటి వ్యాఖ్యలా... ప్రసన్నకుమార్ రెడ్డిపై ఏపీ హైకోర్టు ఆగ్రహం!
- ఇటీవల టీడీపీ ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డిపై ప్రసన్నకుమార్ రెడ్డి వ్యాఖ్యలు
- కేసు నమోదు.. ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించిన వైసీపీ నేత
- తదుపరి విచారణ రేపటికి వాయిదా
ఇటీవల వైసీపీ నేత నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి టీడీపీ మహిళా ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డిపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ క్రమంలో, ప్రసన్నకుమార్ రెడ్డి వ్యాఖ్యలపై ఏపీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మహిళల గురించి మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించింది.
ఓ మహిళా ఎమ్మెల్యేపై అలాంటి వ్యాఖ్యలు చేయడమేంటి? మహిళలకు ఇచ్చే గౌరవం ఇదేనా? అని హైకోర్టు ప్రశ్నించింది. ప్రసన్నకుమార్ రెడ్డి చేసిన అసభ్యకర వ్యాఖ్యలపై నమోదైన కేసులో ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ సందర్భంగా కోర్టు ఈ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఈ వ్యాఖ్యలతో "న్యూసెన్స్" సృష్టించారని హైకోర్టు వ్యాఖ్యానించింది. తదుపరి విచారణను రేపటికి (బుధవారం) వాయిదా వేసింది.
ఇటీవల నెల్లూరు జిల్లాలో ఓ కార్యక్రమంలో ప్రసన్నకుమార్ రెడ్డి మాట్లాడుతూ, ప్రశాంతి రెడ్డి వ్యక్తిగత, కుటుంబ అంశాలను ప్రస్తావిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అదే రోజు సాయంత్రం ఆయన నివాసంపై దాడి జరిగింది.
ఓ మహిళా ఎమ్మెల్యేపై అలాంటి వ్యాఖ్యలు చేయడమేంటి? మహిళలకు ఇచ్చే గౌరవం ఇదేనా? అని హైకోర్టు ప్రశ్నించింది. ప్రసన్నకుమార్ రెడ్డి చేసిన అసభ్యకర వ్యాఖ్యలపై నమోదైన కేసులో ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ సందర్భంగా కోర్టు ఈ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఈ వ్యాఖ్యలతో "న్యూసెన్స్" సృష్టించారని హైకోర్టు వ్యాఖ్యానించింది. తదుపరి విచారణను రేపటికి (బుధవారం) వాయిదా వేసింది.
ఇటీవల నెల్లూరు జిల్లాలో ఓ కార్యక్రమంలో ప్రసన్నకుమార్ రెడ్డి మాట్లాడుతూ, ప్రశాంతి రెడ్డి వ్యక్తిగత, కుటుంబ అంశాలను ప్రస్తావిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అదే రోజు సాయంత్రం ఆయన నివాసంపై దాడి జరిగింది.