Chandrababu Naidu: రేపటి నుంచి చంద్రబాబు ఢిల్లీ పర్యటన... షెడ్యూల్ ఇదిగో!

Chandrababu Naidu Delhi Tour Schedule Released
షార్ట్స్‌లో చూడండి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. దేశ రాజధానిలో ఆయన రెండు రోజుల (జులై 15, 16) పాటు పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలక సమావేశాల్లో పాల్గొని, రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అంశాలపై చర్చించనున్నారు.

పర్యటన వివరాలు...

  • జులై 15 (మంగళవారం) 
    • ఉదయం గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరి 11:45 గంటలకు ఢిల్లీ చేరుకుంటారు.  
    • మధ్యాహ్నం 1:00 గంటకు కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సమావేశం.  
    • మధ్యాహ్నం 2:30 గంటలకు 1-జన్‌పథ్‌లో నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే సరస్వత్‌తో భేటీ.  
    • మధ్యాహ్నం 3:00 గంటలకు ఢిల్లీ మెట్రో ఎండీతో సమావేశం. ఈ సమావేశంలో రాష్ట్రంలో మెట్రో రైలు ప్రాజెక్టులపై చర్చ జరుగనుంది.  
    • మధ్యాహ్నం 3:30 గంటలకు మూర్తి మార్గ్-3లో జరిగే పీవీ నర్సింహారావు సంస్మరణ సభలో ప్రసంగం.  
    • రాత్రి 7:00 గంటలకు కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో సమావేశం.
  • జులై 16 (బుధవారం)  
    • ఉదయం 10:00 గంటలకు కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి మన్షుక్ ఎల్ మాండవీయతో భేటీ.  
    • మధ్యాహ్నం 2:30 గంటలకు జలశక్తి భవన్‌లో కేంద్ర జల్‌శక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో సమావేశం.  
    • సాయంత్రం 4:30 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ.  
    • రాత్రికి ఢిల్లీలోనే బస చేసి, జులై 17 (గురువారం) ఉదయం 9:30 గంటలకు అమరావతికి తిరుగు ప్రయాణం.

ఈ పర్యటనలో ముఖ్యమంత్రి రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన కీలక అంశాలపై కేంద్ర మంత్రులతో చర్చించి, అవసరమైన నిధులు, ప్రాజెక్టులకు మద్దతు కోరనున్నారు.
Go Back to Shorts
Chandrababu Naidu
Andhra Pradesh
Delhi Tour
Amit Shah
Nirmala Sitharaman
Central Ministers
AP Development
Metro Rail Project
Amaravati

More Telugu News