Nara Lokesh: మెగా పీటీఎం 2.0 గ్రాండ్ సక్సెస్ అయింది: మంత్రి నారా లోకేశ్
- ఏపీ వ్యాప్తంగా నిన్న మెగా పేరెంట్-టీచర్ మీటింగ్ 2.0
- అందరికీ కృతజ్ఞతలు తెలిపిన విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్
- ఇలాంటి కార్యక్రమాలో విద్యార్థుల భవితకు బంగారు బాట వేయొచ్చని వెల్లడి
రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన 'మెగా పేరెంట్-టీచర్ మీటింగ్ (పీటీఎం) 2.0' కార్యక్రమం విజయవంతం అయిందని చెబుతూ రాష్ట్ర ఐటీ, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేశ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు, విద్యాశాఖ అధికారులు, సిబ్బంది, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, దాతలు, పూర్వ విద్యార్థులు, ప్రజాప్రతినిధులు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారుల సమష్టి కృషితోనే ఇది సాధ్యమైందని ఆయన అన్నారు.
సమాజం స్వచ్ఛందంగా అందించిన మద్దతు విద్యా వ్యవస్థ అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుందని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయవచ్చని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మధ్య సమన్వయం పెంచడం, విద్యార్థుల ప్రగతిని సమీక్షించడం, పాఠశాలల అభివృద్ధిలో సమాజ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం వంటి లక్ష్యాలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఆయన తెలిపారు.
'మెగా పీటీఎం 2.0' ద్వారా పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన, విద్యా ప్రమాణాల పెంపునకు సంబంధించిన అనేక అంశాలపై చర్చించడం జరిగిందని మంత్రి వివరించారు. తల్లిదండ్రుల నుంచి వచ్చిన సూచనలు, సలహాలను స్వీకరించి, వాటిని అమలు చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన హామీ ఇచ్చారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలను కొనసాగిస్తామని, విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి కృషి చేస్తామని నారా లోకేశ్ తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో నూతనోత్సాహం నింపడమే కాకుండా, వారి భవిష్యత్ నిర్మాణంలో తల్లిదండ్రుల పాత్రను మరింత క్రియాశీలం చేసిందని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు.
సమాజం స్వచ్ఛందంగా అందించిన మద్దతు విద్యా వ్యవస్థ అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుందని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయవచ్చని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మధ్య సమన్వయం పెంచడం, విద్యార్థుల ప్రగతిని సమీక్షించడం, పాఠశాలల అభివృద్ధిలో సమాజ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం వంటి లక్ష్యాలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఆయన తెలిపారు.
'మెగా పీటీఎం 2.0' ద్వారా పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన, విద్యా ప్రమాణాల పెంపునకు సంబంధించిన అనేక అంశాలపై చర్చించడం జరిగిందని మంత్రి వివరించారు. తల్లిదండ్రుల నుంచి వచ్చిన సూచనలు, సలహాలను స్వీకరించి, వాటిని అమలు చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన హామీ ఇచ్చారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలను కొనసాగిస్తామని, విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి కృషి చేస్తామని నారా లోకేశ్ తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో నూతనోత్సాహం నింపడమే కాకుండా, వారి భవిష్యత్ నిర్మాణంలో తల్లిదండ్రుల పాత్రను మరింత క్రియాశీలం చేసిందని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు.