Head Master Harassment: హెచ్ఎం వేధిస్తున్నారంటూ రోడ్డెక్కిన బాలికలు

Tribal Girls Ashram School Students Protest Against HM
షార్ట్స్‌లో చూడండి
మండలంలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో బుధవారం ఉదయం ఉద్రిక్తత నెలకొంది. తమ హెడ్ మాస్టర్ (హెచ్ఎం) తీరుకు నిరసనగా విద్యార్థినులు రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. పీఓ మేడం రావాలంటూ నినాదాలు చేస్తూ నిరసనను వ్యక్తం చేశారు.

పాఠశాల హెచ్ఎం అసభ్యకరంగా మాట్లాడుతూ తమను ఇబ్బంది పెడుతున్నారని విద్యార్థినులు ఆరోపించారు. వసతి గృహంలో సరైన భోజనం పెట్టడం లేదని, ఈ విషయంపై ఎవరికైనా ఫిర్యాదు చేస్తే టీసీ ఇచ్చి పంపిస్తానని బెదిరిస్తున్నారని వాపోయారు. రెండు రోజుల క్రితం కూడా ఇదే విధంగా ఆందోళన చేసేందుకు ప్రయత్నించగా, హెచ్ఎం తమను బుజ్జగించి తిరిగి పాఠశాలకు పంపించారని తెలిపారు.

ఈ సమస్యపై ఉన్నతాధికారులు దృష్టి సారించకపోవడం వల్లే తాము రోడ్డెక్కాల్సి వచ్చిందని విద్యార్థినులు పేర్కొన్నారు. బాలికల పాఠశాలలో మహిళా హెచ్ఎంను నియమిస్తే తమకు ఇలాంటి ఇబ్బందులు ఉండవని, వెంటనే ప్రస్తుత హెచ్ఎంను తొలగించాలని వారు డిమాండ్ చేశారు.

విద్యార్థినుల ఆందోళన విషయం తెలుసుకున్న కోటపల్లి ఎస్ఐ రాజేందర్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. వారి సమస్యలను అడిగి తెలుసుకుని, నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపి, విద్యార్థినులకు న్యాయం చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
Go Back to Shorts
Head Master Harassment
Tribal Girls Ashram School
Kotapally
Student Protest
Telangana Education
Girls School Issues
Hostel Food Problems
Female HM Appointment
Student Union
Injustice

More Telugu News