జ్యోతి మల్హోత్రాకు రెడ్ కార్పెట్.. బీజేపీ విమర్శలపై స్పందించిన కేరళ ప్రభుత్వం

Jyoti Malhotra Red Carpet Kerala Govt Responds to BJP Criticism
షార్ట్స్‌లో చూడండి
పాకిస్థాన్ నిఘా సంస్థలకు దేశ రహస్యాలు చేరవేస్తున్నారన్న ఆరోపణలతో ప్రముఖ యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా అరెస్టవడం కేరళలో రాజకీయ దుమారాన్ని రేపింది. గతంలో ఆమెను కేరళ రాష్ట్ర పర్యాటక శాఖ ప్రచార కార్యక్రమాలకు ఆహ్వానించడంపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఈ వివాదంపై కేరళ ప్రభుత్వం స్పందించింది.

రాష్ట్ర ప్రభుత్వమే జ్యోతి మల్హోత్రాను అధికారికంగా ఆహ్వానించిందని సోమవారం బీజేపీ నేతలు ఆరోపణలు చేశారు. "పాకిస్థాన్‌తో సంబంధాలున్న వ్యక్తికి కేరళలో ఎందుకు రెడ్ కార్పెట్ పరిచారు? ఆమె పర్యటన ఉద్దేశం ఏమిటి? ఇక్కడ ఎవరెవరిని కలిశారు?" అంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు.

ఈ ఆరోపణలపై కేరళ పర్యాటక శాఖ మంత్రి పీఏ. మహమ్మద్ రియాస్ స్పందిస్తూ వివరణ ఇచ్చారు. జ్యోతి మల్హోత్రా ఎంపికలో ప్రభుత్వానికి ఎలాంటి ప్రత్యక్ష ప్రమేయం లేదని స్పష్టం చేశారు. పర్యాటక ప్రచారానికి నియమించుకున్న ఓ ఏజెన్సీ, దేశవ్యాప్తంగా పలువురు ఇన్‌ఫ్లుయెన్సర్లను ఆహ్వానించిందని, వారిలో జ్యోతి మల్హోత్రా కూడా ఒకరని తెలిపారు. ఆమెపై గూఢచర్యం ఆరోపణలు వెలుగులోకి రావడానికి చాలా కాలం ముందే ఈ ప్రచార కార్యక్రమం జరిగిందని ఆయన పేర్కొన్నారు.

‘ట్రావెల్ విత్ జో’ పేరుతో యూట్యూబ్ ఛానల్ నడుపుతున్న జ్యోతి మల్హోత్రా 2023లో పాకిస్థాన్ పర్యటనకు వెళ్లినప్పుడు అక్కడి నిఘా సంస్థల ప్రతినిధులతో సంబంధాలు ఏర్పరచుకున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. 'ఆపరేషన్ సిందూర్' సమయంలోనూ ఆమె పాక్ అధికారులతో మాట్లాడినట్లు సమాచారం. పూర్తి అవగాహనతోనే ఆమె ఈ చర్యలకు పాల్పడినట్లు అధికారులు భావిస్తున్నారు. ఈ ఆరోపణల నేపథ్యంలో ఆమెను అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు.
Go Back to Shorts
Jyoti Malhotra
Kerala government
PA Muhammad Riyas
Pakistan
espionage
travel with jyo

More Telugu News