Kollu Ravindra: కొడాలి నాని, జోగి రమేశ్, వంశీ తప్పించుకోలేరు: మంత్రి కొల్లు రవీంద్ర
- కొడాలి నాని, జోగి రమేశ్, వంశీల అవినీతిని బయటపెడతామని కొల్లు రవీంద్ర హెచ్చరిక
- ఏపీ లిక్కర్ స్కామ్పై తీవ్ర ఆరోపణలు
- ఇది ప్రపంచంలోనే అతిపెద్ద కుంభకోణం అని వ్యాఖ్య
గత ప్రభుత్వంలో కృష్ణా జిల్లాను సర్వనాశనం చేసి, వేల కోట్ల అవినీతికి పాల్పడ్డ మాజీ మంత్రులు కొడాలి నాని, జోగి రమేశ్, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీలను వదిలిపెట్టే ప్రసక్తే లేదని, వారి అవినీతి బాగోతాలను త్వరలోనే ఆధారాలతో సహా బయటపెట్టి, దోచుకున్న సొమ్మంతా కక్కిస్తామని రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం ప్రపంచంలోనే అతిపెద్ద స్కామ్ అని, దాని పుట్టను కదిపితే అందరి బండారం బయటపడుతుందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
మంగళవారం కృష్ణా జిల్లా నాగాయలంక మండలం సోర్లగోంది గ్రామంలో నిర్వహించిన ‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. "గత ఐదేళ్లలో వైసీపీ నాయకులు రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి, ప్రజల సంపదను దోచుకున్నారు. ముఖ్యంగా కృష్ణా జిల్లాను కొడాలి నాని, జోగి రమేశ్, వల్లభనేని వంశీ ముఠా ఇసుక, మద్యం, మట్టి మాఫియాలతో సర్వనాశనం చేశారు. వారి అవినీతి చిట్టాను ఆధారాలతో సహా సిద్ధం చేస్తున్నాం. త్వరలోనే ప్రజల ముందుంచి, వారి నుంచి ప్రతి పైసా కక్కిస్తాం" అని హెచ్చరించారు.
"వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ ప్రపంచంలోనే అతిపెద్ద కుంభకోణం. ఇప్పుడు చీమల పుట్ట కదిలింది, అందరి పేర్లు ఒక్కొక్కటిగా బయటకొస్తాయి" అని వ్యాఖ్యానించారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను చూసి ఓర్వలేక కొందరు ప్రజల్లో అలజడులు సృష్టించేందుకు కుట్రలు పన్నుతున్నారని, వారి ఆటలు సాగవని అన్నారు. గాడి తప్పిన పాలనను తాము నెల రోజుల్లోనే సరిదిద్దామని, ఒకటో తేదీనే జీతాలు, పింఛన్లు అందించి సుపరిపాలనకు శ్రీకారం చుట్టామని తెలిపారు.
మంగళవారం కృష్ణా జిల్లా నాగాయలంక మండలం సోర్లగోంది గ్రామంలో నిర్వహించిన ‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. "గత ఐదేళ్లలో వైసీపీ నాయకులు రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి, ప్రజల సంపదను దోచుకున్నారు. ముఖ్యంగా కృష్ణా జిల్లాను కొడాలి నాని, జోగి రమేశ్, వల్లభనేని వంశీ ముఠా ఇసుక, మద్యం, మట్టి మాఫియాలతో సర్వనాశనం చేశారు. వారి అవినీతి చిట్టాను ఆధారాలతో సహా సిద్ధం చేస్తున్నాం. త్వరలోనే ప్రజల ముందుంచి, వారి నుంచి ప్రతి పైసా కక్కిస్తాం" అని హెచ్చరించారు.
"వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ ప్రపంచంలోనే అతిపెద్ద కుంభకోణం. ఇప్పుడు చీమల పుట్ట కదిలింది, అందరి పేర్లు ఒక్కొక్కటిగా బయటకొస్తాయి" అని వ్యాఖ్యానించారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను చూసి ఓర్వలేక కొందరు ప్రజల్లో అలజడులు సృష్టించేందుకు కుట్రలు పన్నుతున్నారని, వారి ఆటలు సాగవని అన్నారు. గాడి తప్పిన పాలనను తాము నెల రోజుల్లోనే సరిదిద్దామని, ఒకటో తేదీనే జీతాలు, పింఛన్లు అందించి సుపరిపాలనకు శ్రీకారం చుట్టామని తెలిపారు.