Rama Devi: భద్రాచలం ఆలయ ఈవోపై దాడి.. స్పృహ కోల్పోయిన రమాదేవి

Rama Devi Bhadrachalam temple EO attacked
షార్ట్స్‌లో చూడండి
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆలయ భూముల్లోని అక్రమ నిర్మాణాలను అడ్డుకునేందుకు వెళ్లిన కార్యనిర్వహణాధికారి (ఈవో) రమాదేవిపై కొందరు గ్రామస్థులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఆమె స్పృహ తప్పి పడిపోవడంతో పరిస్థితి మరింత తీవ్రంగా మారింది. వెంటనే స్పందించిన ఆలయ సిబ్బంది ఆమెను భద్రాచలంలోని ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

పురుషోత్తపట్నం గ్రామంలో భద్రాద్రి రామాలయానికి చెందిన సుమారు 889.50 ఎకరాల భూమి ఉంది. ఈ భూములను దేవస్థానానికి అప్పగించాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గతంలోనే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అయితే, కొందరు వ్యక్తులు కోర్టు ఉత్తర్వులను ఖాతరు చేయకుండా ఆ భూముల్లో అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నారు.

సమాచారం అందుకున్న ఈవో రమాదేవి, ఇతర ఆలయ సిబ్బందితో కలిసి మంగళవారం ఆ ప్రాంతానికి చేరుకుని నిర్మాణాలను అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే ఆక్రమణదారులకు, ఆలయ సిబ్బందికి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ తోపులాటలోనే ఈవో రమాదేవిపై దాడి జరిగింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఆలయ భూముల పరిరక్షణకు వెళ్లిన మహిళా అధికారిపై దాడి జరగడంపై పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Go Back to Shorts
Rama Devi
Bhadradri Ramalayam
Bhadradri Temple
Purushottampatnam
Temple lands

More Telugu News