MM Keeravaani: కీరవాణికి పితృవియోగం... సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ స్పందన
- కీరవాణి ఇంట విషాదం
- తండ్రి శివశక్తి దత్తా కన్నుమూత
- కీరవాణి కుటుంబ సభ్యులకు చంద్రబాబు, లోకేశ్ ప్రగాఢ సానుభూతి
ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి ఇంట విషాదం నెలకొంది. ఆయన తండ్రి, ప్రముఖ సినీ రచయిత, చిత్రకారుడు కోడూరి శివశక్తి దత్తా అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కీరవాణి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందిస్తూ... శివశక్తి దత్తా మరణం తెలుగు చలనచిత్ర రంగానికి తీరని లోటని విచారం వ్యక్తం చేశారు. తన అద్భుతమైన రచనలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ఆయన చెరగని ముద్ర వేశారని కొనియాడారు. ఆయన రాసిన పాటలు పాన్ ఇండియా స్థాయిలో విజయాలు సాధించడం తెలుగు వారందరికీ గర్వకారణమని చంద్రబాబు పేర్కొన్నారు. శివశక్తి దత్తా ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తూ, కీరవాణి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
మంత్రి నారా లోకేశ్ కూడా శివశక్తి దత్తా మృతికి సంతాపం తెలిపారు. కేవలం గీత రచయితగానే కాకుండా, చిత్రకారుడిగా కూడా సినీ రంగానికి ఆయన విశేష సేవలు అందించారని గుర్తు చేసుకున్నారు. తన అసాధారణ ప్రతిభతో ప్రేక్షకులను ఆకట్టుకున్న గొప్ప కళాకారుడని లోకేశ్ అన్నారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు పేర్కొంటూ, కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందిస్తూ... శివశక్తి దత్తా మరణం తెలుగు చలనచిత్ర రంగానికి తీరని లోటని విచారం వ్యక్తం చేశారు. తన అద్భుతమైన రచనలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ఆయన చెరగని ముద్ర వేశారని కొనియాడారు. ఆయన రాసిన పాటలు పాన్ ఇండియా స్థాయిలో విజయాలు సాధించడం తెలుగు వారందరికీ గర్వకారణమని చంద్రబాబు పేర్కొన్నారు. శివశక్తి దత్తా ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తూ, కీరవాణి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
మంత్రి నారా లోకేశ్ కూడా శివశక్తి దత్తా మృతికి సంతాపం తెలిపారు. కేవలం గీత రచయితగానే కాకుండా, చిత్రకారుడిగా కూడా సినీ రంగానికి ఆయన విశేష సేవలు అందించారని గుర్తు చేసుకున్నారు. తన అసాధారణ ప్రతిభతో ప్రేక్షకులను ఆకట్టుకున్న గొప్ప కళాకారుడని లోకేశ్ అన్నారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు పేర్కొంటూ, కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.